ఇకపై ఇండస్ట్రీలో మార్పులు వస్తాయి

ఇకపై ఇండస్ట్రీలో మార్పులు వస్తాయి

సతీష్ వేగేశ్న దర్శక నిర్మాతగా రూపొందిస్తున్న చిత్రం ‘కథాకేళి’. ఈ సినిమాతో శతమానం భవతి ఆర్ట్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌ను స్టార్ట్ చేశారు సతీష్. ఈ బ్యానర్‌‌‌‌‌‌‌‌ లోగోను ఆదివారం దిల్ రాజు లాంచ్ చేశారు. అలాగే ‘కథాకేళి’ టీజర్‌‌‌‌‌‌‌‌ను దర్శకుడు హరీష్ శంకర్ రిలీజ్ చేశారు. 

ఈ సందర్భంగా జరిగిన ప్రెస్‌‌‌‌మీట్‌‌‌‌లో దిల్ రాజు మాట్లాడుతూ ‘నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ ‘శతమానం భవతి’. ఈ చిత్రంతో దర్శకుడిగా సక్సెస్ అందుకుని అదే పేరుతో సతీష్ బ్యానర్ పెట్టడం హ్యాపీ. ‘కథాకేళి’ టీజర్ ఇంటరెస్టింగ్‌‌‌‌గా ఉంది. టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్’ అని చెప్పారు. హరీష్ శంకర్ మాట్లాడుతూ ‘సతీష్‌‌‌‌తో నాకు ఎప్పట్నుంచో జర్నీ ఉంది. రైటర్‌‌‌‌‌‌‌‌గా, దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఆయన ప్రొడ్యూసర్ అవడం ఆనందంగా ఉంది. 

ఈ బ్యానర్‌‌‌‌‌‌‌‌లో మరిన్ని మంచి చిత్రాలు వస్తాయి. ఫిలిం చాంబర్ ప్రెసిడెంట్‌‌‌‌గా ఎన్నికైన దిల్ రాజు గారికి కంగ్రాట్యులేషన్స్. ఇక నుంచి తెలుగు సినీ ఇండస్ట్రీలో అద్భుతమైన మలుపులు, మార్పులు వస్తాయి. ఇక ‘కథాకేళి’ చిత్రం టీమ్ అందరికీ మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నా’ అని అన్నారు. 

సతీష్ వేగేశ్న మాట్లాడుతూ ‘ఇరవై ఐదేళ్ల నుంచి  రైటర్‌‌‌‌‌‌‌‌గా, దర్శకుడిగా ఇండస్ట్రీలో ఉన్నా. సినిమాలు తప్ప నాకేమీ తెలీదు. అందుకే ప్రొడ్యూసర్‌‌‌‌‌‌‌‌గా బ్యానర్ స్టార్ట్ చేశా. ఈ ప్రయాణానికి కారణమైన ప్రతి ఒక్కరికీ జీవితాంతం రుణపడి ఉంటాను. దెయ్యం కథలు చాలామంది చెప్పి ఉంటారు. కానీ దెయ్యానికే కథలు చెప్పాల్సి వస్తే.. అనేదే ‘కథాకేళి’ కాన్సెప్ట్’ అని  చెప్పారు.  చిత్ర సమర్పకులు చింతా గోపాలకృష్ణ, హీరోలు బాలాదిత్య, అజయ్,  హీరోయిన్స్ పూజిత పొన్నాడ, ఆయుషి  సహా టీమ్ అంతా పాల్గొన్నారు.