గీతగోవిందం కాంబో రిపీట్.. అఫీషియల్గా మొదలైన విజయ్, దిల్ రాజు మూవీ

గీతగోవిందం కాంబో రిపీట్.. అఫీషియల్గా మొదలైన విజయ్, దిల్ రాజు మూవీ

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు(Dil Raju) రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) కాంబోలో వస్తున్నసినిమా జూన్ 14న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా  ప్రారంభమైంది. సర్కారువారి పాట(Sarkaruvaari pata) తరువాత పరశురామ్(Parasuram) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో.. సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) హీరోయిన్ గా నటిస్తోంది. 

ఇక ఈ సినిమా మొదటి షాట్ కు ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి(Shyamprasad reddy) క్లాప్ కొట్టారు.త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్లు దిల్ రాజు ప్రకటించారు. లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ గోపీ సుందర్(Gopi Sunder) సంగీతం అందిస్తున్న ఈ సినిమా.. 2024లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక ఇప్పటికే డైరెక్టర్ పరశురామ్, విజయ్ కాంబోలో గీత గోవిందం మూవీ వచ్చిన సంగతి తెలిసిందే. రష్మిక(Rshmika) హీరోయిన్ గా నటించిన ఈ సినిమా.. సూపర్ హిట్ గా నిలిచింది. ఆ సమయంలో గీత గోవిందం(Geetha Govindam) సినిమాకు సీక్వెల్ కూడా ప్రకటించారు మేకర్స్. మరి పరశురామ్ విజయ్ తో చేస్తున్న ఈ సినిమా గీత గోవిందం సినిమాకు సీక్వెల్ గా వస్తుందా.. లేక కొత్త కంటెంట్ తో వస్తున్నారా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.