టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు(Dil Raju) రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) కాంబోలో వస్తున్నసినిమా జూన్ 14న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. సర్కారువారి పాట(Sarkaruvaari pata) తరువాత పరశురామ్(Parasuram) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో.. సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) హీరోయిన్ గా నటిస్తోంది.
ఇక ఈ సినిమా మొదటి షాట్ కు ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి(Shyamprasad reddy) క్లాప్ కొట్టారు.త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్లు దిల్ రాజు ప్రకటించారు. లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ గోపీ సుందర్(Gopi Sunder) సంగీతం అందిస్తున్న ఈ సినిమా.. 2024లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక ఇప్పటికే డైరెక్టర్ పరశురామ్, విజయ్ కాంబోలో గీత గోవిందం మూవీ వచ్చిన సంగతి తెలిసిందే. రష్మిక(Rshmika) హీరోయిన్ గా నటించిన ఈ సినిమా.. సూపర్ హిట్ గా నిలిచింది. ఆ సమయంలో గీత గోవిందం(Geetha Govindam) సినిమాకు సీక్వెల్ కూడా ప్రకటించారు మేకర్స్. మరి పరశురామ్ విజయ్ తో చేస్తున్న ఈ సినిమా గీత గోవిందం సినిమాకు సీక్వెల్ గా వస్తుందా.. లేక కొత్త కంటెంట్ తో వస్తున్నారా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.