తల్లి పెళ్ళికి ఒప్పుకోలేదని బాలికపై అత్యాచారం

తల్లి పెళ్ళికి ఒప్పుకోలేదని బాలికపై అత్యాచారం

దిల్ సుఖ్ నగర్, వెలుగు: పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి మైనర్ బాలిక కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన యువకుడిని చైతన్యపురి పోలీసులు గురువారం అరెస్టు చేశారు. చైతన్యపురి ఇన్ స్పెక్టర సుదర్శన్ కథనం ప్రకారం..శంషాబాద్ మండలం పెద్ద షాపూర్ అలికోట్ తండాకు చెందిన జటావత్ దశ్రు(22) ప్రైవేటు జాబ్ చేసుకుంటూ.. ఓ స్కూల్ లో డ్యాన్స్ మాస్టర్ గా పనిచేస్తున్నాడు. కొత్తపేట లో ఉండే ఓ మైనర్ బాలికకు పాఠశాలలో డాన్స్ మాస్టర్ గా ఉన్న దశ్రు పరిచయమయ్యాడు.

ఈ క్రమంలో బాలికతో స్నేహాన్ని పెంచుకున్న దశ్రు తరచూ ఫోన్ చేసి ఆమె ఇంటికి వెళ్లేవాడు. ఆ బాలికను పెళ్లిచేసుకుంటానని నమ్మించాడు. ఈ నెల 24న దశ్రు తన ఫ్రెండ్ కేతవత్ సక్రు(21)తో కలిసి బాలిక ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో బాలిక ఒక్కతే ఉండటంతో దశ్రు తన ఫ్రెండ్ సాయంతో ఆమెను బైక్ పై బలవంతంగా ఎక్కించుకుని శంషాబాద్ తీసుకెళ్లాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లి దశ్రుకి ఫోన్ చేయగా.. మా ఊరికి వచ్చి పెద్దలతో మాట్లాడి పెళ్లి చేయాలన్నారు. ఇందుకు బాలిక కుటుంబీకులు ఒప్పుకోలేదు. దీంతో దశ్రు బాలికను తన బంధువుల ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.

ఈ ఘటనపై బాలిక తల్లి చైతన్యపురి పోలీస్ స్టేషన్ లో ఈ నెల 26న కంప్లయింట్ చేసింది. మొబైల్ నంబర్ ఆధారంగా గురువారం దశ్రును అరెస్ట్ చేసిన పోలీసులు పొక్సో కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. నిందితుడి స్నేహితుడు సక్రు పరారీలో ఉన్నాడన్నారు. ఈ కేసు ఎస్సై సాయి ప్రకాష్ దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్ స్పెక్టర్ సుదర్శన్ తెలిపారు.

దశ్రు