- బడ్జెట్ అంచనాల్లో 81 శాతం చేరుకున్నామన్న ప్రభుత్వం
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు నికరంగా రూ. 14.70 లక్షల కోట్ల డైరెక్ట్ ట్యాక్స్ ( పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్) ఆదాయం వచ్చిందని ప్రభుత్వం ప్రకటించింది. కిందటి ఆర్థిక సంవత్సరంలోని ఇదే టైమ్తో పోలిస్తే 19.41 శాతం వృద్ధి చెందిందని తెలిపింది. బడ్జెట్ అంచనాల్లో ఇప్పటికే 81 శాతం డైరెక్ట్ ట్యాక్స్ వసూలయ్యిందని వివరించింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.18.23 లక్షల కోట్ల డైరెక్ట్ ట్యాక్స్ ఆదాయం వస్తుందని బడ్జెట్ అంచనా వేసింది. ఈ అంచనా కూడా 2022–23 కి గాను వేసిన రూ.16.61 లక్షల కోట్ల కంటే 10 శాతం ఎక్కువ. కిందటేడాది ఏప్రిల్ 1 నుంచి ఈ నెల 10 వరకు రూ.2.48 లక్షల కోట్లు రిఫండ్ చేశామని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) ప్రకటించింది.
గ్రాస్ లెవెల్లో డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ నిలకడగా పెరుగుతున్నాయని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.17.18 కోట్ల గ్రాస్ డైరెక్ట్ ట్యాక్స్ వసూలయ్యిందని వెల్లడించింది. ఇది ఇయర్ ఆన్ ఇయర్ ప్రకారం 16.77 శాతం ఎక్కువ. కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయం 8 శాతం, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయం 26 శాతం పెరిగాయి.