రాజకీయాల్లోకి రాను..ప్రజాసేవ చేయను: ఆర్జీవీ

రాజకీయాల్లోకి రాను..ప్రజాసేవ చేయను: ఆర్జీవీ

రాజకీయాల్లోకి రానని..ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం తనకు లేదన్నారు డైరెక్టర్ రాంగోపాల్ వర్మ. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో మీడియా సమావేశం నిర్వహించిన వర్మ..ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ కాకుండా కుట్రలు జరిగాయని ఆరోపించారు. కొందరు  తమ భాగోతం బయపడుతుందనే సినిమాను ఆపేశారని అన్నారు.ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా.. ఈ నెల 31న మూవీ రిలీజ్ అవుతుందని చెప్పారు. ఈ సందర్భంగా టీడీపీ, చంద్రబాబుపై సెటైర్లు వేశారు. సైకిల్ టైర్ పంక్చర్ అయ్యిందనే.. కారులో ఇక్కడకు వచ్చామన్నారు . మహర్షి సినిమాపై అక్కడున్న రిపోర్టర్లు ప్రశ్నించగా..  రైతుల కష్టాలు తనకు తెలియదని.. తానెప్పుడూ పొలం వెళ్లలేదన్నారు వర్మ. మహేష్ బాబు లేకుండా మహర్షి సినిమా తీస్తే ఎవరు చూస్తారని ప్రశ్నించారు వర్మ.