
బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ షాకింగ్ కామెంట్స్ చేశారు. స్టార్స్, సెలెబ్రెటీల గురించి మాట్లాడిన ఆయన.. వంట మనుషుల కోసం లక్షలు ఖర్చు చేస్తున్నారు అంటూ ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ న్యూస్ తెలిసిన నెటిజన్స్ కూడా నోరెళ్లబెడుతున్నారు.
ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. ఇటీవల ఈ ఈవెంట్ లో పాల్గొన్న ఆయన స్టార్స్ గురించి మాట్లాడుతూ.. కొంతమంది స్టార్స్ షూటింగ్ సమయంలో ఫుడ్ కోసం ప్రత్యేకమైన వంటవారిని నియమించుకుంటున్నారు. వారు రోజుకి లక్షల్లో డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు.. హెయిర్, మేకప్ ఆర్టిస్టులను కూడా సెపరేట్ గా మెయిన్టైన్ చేస్తున్నారు. వారు కూడా రోజులో లక్షల్లో తీసుకుంటున్నారు. ఇది సినిమా కోసం పనిచేస్తున్న వారికన్నా చాలా ఎక్కువ. ఆ పని నేర్చుకొని ఉంటే నేను ఈపాటికే ధనవంతుడిని అయ్యేవాడిని అన్నారు.
అంతేకాదు.. ఇటీవల జరిగిన షూటింగ్ ఒక హీరో బర్గర్ కోసం తన డ్రైవర్ ను కిలోమీటర్ల దూరం పంపాడు. ఇలాంటి ఖర్చులు సినిమా నిర్మాణ వ్యయాన్ని పెంచుతున్నాయని, నిర్మాతలు ఇలాంటి వారిని సెట్స్ పైకి అనుమతించకూడదని పేర్కొన్నాడు. ప్రస్తుతం అనురాగ్ చేసిన ఈ కామెంట్స్ ఇండస్ట్రీలో దుమారం రేపుతున్నాయి.