కలశ ట్రైలర్‌‌‌‌ను రిలీజ్ చేసిన.. గోపిచంద్ మలినేని

కలశ ట్రైలర్‌‌‌‌ను రిలీజ్ చేసిన.. గోపిచంద్ మలినేని

భానుశ్రీ, సోనాక్షి వర్మ, అనురాగ్‌‌ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘కలశ’. కొండ రాంబాబు దర్శకత్వంలో రాజేశ్వరి చంద్రజ వాడవల్లి నిర్మించారు. డిసెంబర్ 15న సినిమా విడుదల కానుంది. ట్రైలర్‌‌‌‌ను రిలీజ్ చేసిన  డైరెక్టర్ గోపిచంద్ మలినేని.. ట్రైలర్ చాలా ఇంటరెస్టింగ్‌‌గా ఉందని, సినిమా సక్సెస్ అవ్వాలని విష్ చేశాడు.

హారర్ థ్రిల్లర్ బ్యాక్‌‌డ్రాప్‌‌లో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ ఆసక్తిని పెంచేలా ఉంది. జీవా, సమీర్‌‌, రవివర్మ ముఖ్య పాత్రలు పోషించారు. సినిమా చూసిన ప్రేక్షకులు కచ్చితంగా థ్రిల్ అవుతారని నటీనటులు చెప్పారు.