దృశ్యం 3 రాబోతుంది

దృశ్యం 3 రాబోతుంది

మలయాళంలోనే కాక తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ సూపర్ హిట్టయింది ‘దృశ్యం’. మోహన్‌‌ లాల్ హీరోగా నటించిన ఈ సినిమా బెస్ట్ స్క్రీన్‌‌ప్లేకి పర్‌‌‌‌ఫెక్ట్ ఎగ్జాంపుల్‌‌గా నిలిచింది. సెకెండ్ పార్ట్ కూడా అందరినీ మెప్పించింది. ఇప్పుడు మూడో పార్ట్‌‌కి రెడీ అవుతున్నారు మోహన్‌‌లాల్. ‘దృశ్యం 3’ లోడింగ్ అంటూ దర్శకుడు జీతూ జోసెఫ్ నిన్న అప్‌‌డేట్ కూడా ఇచ్చాడు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌‌‌‌లో ఒక టేబుల్ ముందు కూర్చుని తీక్షణంగా చూస్తున్నారు లాల్.

ఆయన చేతికి బేడీలున్నాయి. దాన్నిబట్టి అది ఇంటరాగేషన్ సీన్ అని అర్థమవుతోంది. తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి రెండు భాగాల్లో ఇంటెలిజెంట్ జర్నీ చేశారు లాల్. మరి మూడో పార్ట్‌‌లో ఏం చేయబోతున్నారో!