
కమల్ హసన్ కీలక పాత్రలో మణిరత్నం తెరకెక్కిస్తున్న సినిమా థగ్ లైఫ్. నాయకన్ తర్వాత వారిద్దరి కాంబినేషన్లో వస్తోన్న చిత్రమిది. గ్యాంగ్ స్టర్, యాక్షన్ డ్రామా ఫిల్మ్ గా ఇది సిద్ధమవుతోంది.
త్రిష, శింబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అన్ని కార్యకమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ జూన్ 5వ తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది.
ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది. అయితే, ట్రైటర్లో త్రిష, అభిరామిలతో కమల్ హాసన్ రొమాన్స్ చేసే సన్నివేశాలపై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి.
70 ఏళ్ల కసుల్, 42ఏళ్ల త్రిషతో రొమాన్స్ ఏంటి? అంటూ పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు. తనకంటే వయసులో 28ఏళ్ల చిన్నదైనా అభిరామితో లిప్ లాక్ పైనా కొందరు ట్రోల్స్ చేశారు.
Also Read : పవర్ఫుల్ క్యారెక్టర్లో తేజ్
ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ పాల్గొన్న దర్శకుడు మణిరత్నం విమర్శలకు సమాధానం చెప్పాడు. ‘నిజజీవితంలోనూ అలాంటి వ్యక్తులు ఉంటారని, సినిమాలో వాళ్లు పోషించిన పాత్రల గురించి మాత్రమే చూడాలి కానీ, కమల్, త్రిషను దృష్టిలో పెట్టుకొని చూదొద్దన్నారు. అలాగే, పురుషులు, మహిళలు ఎవరైనా తమకంటే చిన్నవారితో లేదా పెద్దవారితో రిలేషన్షిప్లో ఉంటారు. అది జీవిత సత్యం.
ఇలాంటి బంధాలు ఇప్పుడు పుట్టినవి కావు. ఎంతో కాలం నుంచి ఉన్నాయి. మీరు ఈ సినిమా చూసిన తర్వాత వాళ్ల బంధం ఏంటి? ఎలా ఏర్పడింది? ఇది వాస్తవమా? కాదా? తెలుసుకుని అప్పుడు మీరు మీ నిర్ణయాలను చెప్పండి.
అంతేకానీ, కమల్, త్రిషను దృష్టిలో పెట్టుకొని మాట్లాడొద్దు’అంటూ మణిరత్నం అదిరిపోయే ఆన్సర్ ఇచ్చారు. ఈ సమాధానంతో నెటిజన్లకు ఓ క్లారిటీ వచ్చే ఉంటుందని కమల్ ఫ్యాన్స్ ఇపుడు పోస్టులు పెడుతున్నారు.
#ManiRatnam defends Kamal-Trisha’s romance in #ThugLife -
— MOHIT_R.C (@Mohit_RC_91) May 28, 2025
-: Real-life relationships with notable age differences are quite common in the society, People are attempting to ignore what is happening in the society. such relationships should not be judged differently on screen :- pic.twitter.com/yQ2rYdVCT2
ట్రైలర్ ఎలా ఉందంటే:
ఓ నాయకుడు, అతను పెంచుకునే వారసుడు.. ప్రత్యర్థులు ఆ పవర్ను లాక్కోవడానికి చేసే ప్రయత్నాలు.. వీటన్నింటినీ చూపిస్తూ ఆసక్తిని కలిగించేలా ట్రైలర్ను కట్ చేశారు. ఇందులో కమల్ హాసన్ డిఫరెంట్ గెటప్స్లో కనిపిస్తూ ఇంప్రెస్ చేశాడు. శింబు సాలిడ్ రోల్లో చేసినట్టుగా అర్ధమవుతోంది. ‘ఇది యముడికి నాకు జరిగే కథ.. నువ్వా నేనా’ అని కమల్ హాసన్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది.
అశోక్ సెల్వన్, జోజు జార్జ్, నాజర్, మహేష్ మంజ్రేకర్, అలీ ఫజల్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, అభిరామి వంటి స్టార్స్ ను చూపిస్తూ సాగిన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ హైలైట్గా నిలిచింది. రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్ బ్యానర్లు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో శ్రేష్ఠ్ మూవీస్ రిలీజ్ చేస్తోంది.