ఆదిపురుష్ డబుల్ ధమాకా

ఆదిపురుష్ డబుల్ ధమాకా

ఒకే సిరీస్‌‌‌‌లో రెండు మూవీస్ చేయడం అంత ఈజీ కాదు. ‘బాహుబలి’ సిరీస్‌‌‌‌లో నటించిన ప్రభాస్‌‌‌‌కి ఆ విషయం బాగా తెలుసు. అయినప్పటికీ మరో రెండు సినిమాల సీక్వెల్స్‌‌‌‌లో ప్రభాస్‌‌‌‌ నటించే అవకాశాలు కనిపిస్తు న్నాయి. ప్రశాంత్‌‌‌‌ నీల్‌‌‌‌ దర్శకత్వంలో ప్రభాస్‌‌‌‌ నటిస్తున్న ‘సాలార్‌‌‌‌‌‌‌‌’ మూవీ రెండు భాగాలుగా రూపొందనున్న విషయం ఇప్పటికే రివీల్ అయ్యింది. ఇక కొత్తగా ‘ఆదిపురుష్‌‌‌‌’కి కూడా సీక్వెల్‌‌‌‌ ప్లాన్‌‌‌‌ చేస్తున్నాడట దర్శకుడు ఓం రౌత్. రామాయణం ఆధారంగా భారీ వీఎఫ్‌‌‌‌ఎక్స్‌‌‌‌ వర్క్‌‌‌‌తో రూపొందుతున్న ఈ మూవీ వచ్చే యేడు సంక్రాంతికి విడుదల కానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. సీక్వెల్‌‌‌‌కి సంబంధించిన ఐడియాను ఇప్పటికే ప్రభాస్‌‌‌‌కి చెప్పాడట ఓం. ప్రభాస్‌‌‌‌ పాజిటివ్‌‌‌‌గా రియాక్ట్‌‌‌‌ అయినట్టు తెలుస్తోంది.

ఇక ‘రాధేశ్యామ్‌‌‌‌’ ప్రమోషన్స్‌‌‌‌ కారణంగా ప్రభాస్‌‌‌‌ నెక్స్ట్ మూవీస్‌‌‌‌ షూటింగ్స్‌‌‌‌కి బ్రేక్ వచ్చింది. చిన్న సర్జరీ జరగడంతో ప్రస్తుతం స్పెయిన్‌‌‌‌లో రెస్ట్‌‌‌‌ తీసుకుంటున్న ప్రభాస్,  మే నెల నుంచి ‘సాలార్‌‌‌‌‌‌‌‌’ షూటింగ్‌‌‌‌లో జాయినవనున్నాడు. ఈ ఇయర్​ ఎండింగ్‌‌‌‌ కల్లా షూటింగ్ పూర్తి చేసి.. వచ్చే యేడు ఏప్రిల్‌‌‌‌, జూన్​ల మధ్య రిలీజ్‌‌‌‌ చేస్తామని రీసెంట్‌‌‌‌ ఇంటర్వ్యూలో చెప్పారు నిర్మాత విజయ్ కిరగందూర్. సీక్వెల్‌‌‌‌ గురించి మాత్రం ఆయన నోరు విప్పలేదు. ఇక మారుతి దర్శకత్వంలో ప్రభాస్‌‌‌‌ ఓ సూపర్‌‌‌‌‌‌‌‌ నేచురల్‌‌‌‌ యాక్షన్‌‌‌‌ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌ చేయబోతున్నాడు. ఇందులో బాలీవుడ్‌‌‌‌ యాక్టర్ బోమన్ ఇరానీ నటించనున్నట్లు తెలుస్తోంది. ఓ ఇంటి చుట్టూ జరిగే ఈ కథలో ఆయనో దెయ్యం పాత్రలో కనిపిస్తారని టాక్. హీరోయిన్స్‌‌‌‌గా శ్రీ లీల, మాళవికా మోహనన్‌‌‌‌ల పేర్లు వినిపిస్తున్నాయి. కన్ఫ ర్మేషన్ రావాల్సి ఉంది.