అందరూ కలిసి హాయిగా నవ్వుకునేలా..

అందరూ కలిసి హాయిగా నవ్వుకునేలా..

మలయాళంలో సూపర్ హిట్‌‌‌‌‌‌‌‌ అయిన ‘ప్రేమలు’ చిత్రాన్ని ఎస్.ఎస్.కార్తికేయ తెలుగులో విడుదల చేశాడు. నస్లెన్ కె గఫూర్, మమితా బైజూ లీడ్ రోల్స్‌‌‌‌‌‌‌‌ చేసిన ఈ  చిత్రానికి గిరీష్ ఏడీ దర్శకత్వం వహించాడు. ‘నైంటీస్’ ఫేమ్ ఆదిత్య హాసన్ తెలుగులో డైలాగ్స్ రాశాడు. ఇటీవల విడుదలైన ఈ మూవీ సక్సెస్‌‌‌‌‌‌‌‌ మీట్‌‌‌‌‌‌‌‌ను మంగళవారం నిర్వహించారు. ముఖ్య​అతిథిగా హాజరైన రాజమౌళి మాట్లాడుతూ ‘నేను లవ్ స్టోరీస్, రొమాంటిక్ కామెడీ సినిమాలు ఎక్కువగా ఇష్టపడను. అందుకే కార్తికేయ ఈ సినిమా గురించి చెబితే అంతగా పట్టించుకోలేదు. కానీ థియేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చూసినప్పుడు నవ్వుతూనే ఉన్నాను.

ఇది థియేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జనంతో కలిసి నవ్వుతూ చూడాల్సిన సినిమా. తెలుగులో ఆదిత్య హాసన్‌‌‌‌‌‌‌‌ డైలాగ్స్ అద్భుతంగా రాశాడు. మలయాళంలో అందరూ బాగా నటిస్తారు. ఇందులోనూ అద్భుతంగా నటించారు. ఇంత బాగా పాత్రలను రాసిన, తీసిన దర్శకుడు గిరీష్‌‌‌‌‌‌‌‌కు కంగ్రాట్స్. మా కార్తికేయ ఫస్ట్ టైమ్ డిస్ట్రిబ్యూషన్‌‌‌‌‌‌‌‌లోకి వచ్చాడు. ప్రతీ రోజూ కలెక్షన్లు పెరుగుతూనే ఉన్నాయి.

సక్సెస్‌‌‌‌‌‌‌‌ను ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని చెప్పారు. ‘స్ట్రయిట్ సినిమాలా అనిపించిందని, సినిమా చూసి చాలా ఎంజాయ్ చేశానని కీరవాణి అన్నారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ  ‘ప్రేమలు మలయాళంలో కంటే తెలుగులో పెద్ద హిట్ అయింది. డైలాగ్స్ బాగున్నాయి. సినిమా చాలా క్యూట్‌‌‌‌‌‌‌‌గా ఉంది. ఎంతో హాయిగా అనిపిస్తుంది’ అన్నాడు. ‘చాలా తక్కువ టైమ్‌‌‌‌‌‌‌‌లో క్వాలిటీగా ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాం’ అని కార్తికేయ చెప్పాడు. దర్శకుడు గిరీష్, నటీనటులు మమిత, నస్లీన్, కార్తిక, మాటలు రాసిన ఆదిత్య హాసన్ మాట్లాడారు.