
కేసీఆర్ ఆరేళ్ల పాలన తెలంగాణలోని పేదలు, కార్మికులు, ఉద్యోగులకు నిరాశ కలిగించిందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కుటుంబసభ్యులతో కలిసి ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
పేదలకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతోనే సోనియా తెలంగాణ ఇచ్చారని చెప్పారు రాజగోపాల్ రెడ్డి. హామీలను అమలు చేయకపోవడం వల్లే ఎంపీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు…. కేసీఆర్ కూతురును ఓడించారన్నారు. ముఖ్యమంత్రి సీటులో కూర్చునే అర్హత కేసీఆర్ కు లేదన్నారు.