శ్రీశైలం ఆలయం దగ్గర అనుమానాస్పద బ్యాగ్.. తెరిచి చూస్తే..

శ్రీశైలం ఆలయం దగ్గర అనుమానాస్పద బ్యాగ్.. తెరిచి చూస్తే..

శ్రీశైలం ఆలయం దగ్గర అనుమానాస్పద బ్యాగ్ కలకలం రేపింది.. సోమవారం ( జూన్ 23 ) ఆలయ సమీపంలోని వాసవి సత్రం వెనక డివైడర్ పై చెట్ల పొదల్లో ఉన్న ఓ బ్యాగ్ అక్కడున్న పారిశుధ్య కార్మికులు గమనించారు. చాలా సేపటి నుంచి బ్యాగ్ అక్కడే ఉండటంతో తెరిచి చూసిన పారిశుధ్య కార్మికులు షాక్ అయ్యి.. బ్యాగ్ గురించి పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బ్యాగ్ ను తెరిచి చూడగా.. అందులో నాలుగు 9mm బుల్లెట్లు,నాలుగు SLR బుల్లెట్లు, 4 బులెట్ షెల్స్, ఒక ఎర్ర కండువా ఉన్నాయి.

ALSO READ | ఆధ్యాత్మికం : గుళ్లో ధ్వజ స్థంభాన్ని ఏ చెట్టుతో తయారు చేస్తారు... తెలంగాణలో ఎక్కడ ఉన్నాయో తెలుసా..!

ఘటనాస్థలం దగ్గర బ్యాగ్ స్వాధీనం చేసుకున్న పోలీసులు.. బ్యాగ్ ను పరిశీలిస్తున్నారు. అనుమానాస్పదంగా లభించిన బ్యాగ్ అడవిలో వేటకు వెళ్లేవారిదా లేక మావోయిస్టులదా అన్న కోణంలో పరిశీలిస్తున్నారు పోలీసులు. బ్యాగ్ లో ఎర్ర కండువా ఉండటం పలు అనుమానాలకు దారి తీస్తోంది. 

తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాల్లో ఒకటైన శ్రీశైలం ఆలయానికి దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. అంతటి ప్రసిద్ధి చెందిన ఆలయ పరిసరాల్లోకి బుల్లెట్లు, పేలుడు పదార్థాలతో ఉన్న బ్యాగ్ ప్రత్యక్షమవడం భద్రత పట్ల అనుమానాలకు దారి తీస్తోంది.