ENG vs IND 2025: మ్యాచ్ మన చేతుల్లోనే: వారెవ్వా పంత్.. రెండు ఇన్నింగ్స్‌ల్లో రిషబ్ సెంచరీల మోత

ENG vs IND 2025: మ్యాచ్ మన చేతుల్లోనే: వారెవ్వా పంత్.. రెండు ఇన్నింగ్స్‌ల్లో రిషబ్ సెంచరీల మోత

ఇంగ్లాండ్ తో జరుగుతున్న లీడ్స్ టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన పంత్.. రెండో ఇన్నింగ్స్ లోనూ అదే జోరు కొనసాగించాడు. ఇన్నింగ్స్ 70 ఓవర్లో బషీర్ బౌలింగ్  సింగిల్ తిరిగి 130 బంతుల్లో తన సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఈ టెస్టులో పంత్ కు ఇది రెండో సెంచరీ కాగా.. ఓవరాల్ గా టెస్ట్ కెరీర్ లో 8 వది. తొలి ఇన్నింగ్స్ లో 134 పరుగులు చేసిన పంత్.. రెండో ఇన్నింగ్స్ లో 100 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నాడు. పంత్ ఇన్నింగ్స్ లో 14 ఫోర్లు, 2 సిక్సర్లున్నాయి.   

ALSO READ | ENG vs IND 2025: సెంచరీతో అదరగొట్టిన రాహుల్.. భారీ ఆధిక్యం దిశగా ఇండియా

గిల్ ఔట్ కావడంతో క్రీజ్ లోకి వచ్చిన పంత్ నాలుగో రోజు తొలి సెషన్ లో ఆచితూచి బ్యాటింగ్ చేశాడు. తన శైలికి పూర్తి విభిన్నంగా బ్యాటింగ్ చేశాడు. లంచ్ సమయానికి 31 పరుగులు చేసిన పంత్.. రెండో సెషన్ లో వేగంగా ఆడాడు. ఎక్కువ సమయం తీసుకోకుండా బౌండరీల వర్షం కురిపించాడు. పంత్ తో పాటు మరో ఎండ్ లో రాహుల్ కూడా సెంచరీ బాదడంతో టీమిండియా భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తుంది. ప్రస్తుతం 3 వికెట్ల నష్టానికి 264 పరుగులతో నిలిచింది. దీంతో ఆధిక్యం 270 పరుగులకు చేరింది. క్రీజ్ లో రాహుల్ (113), పంత్ (100) ఉన్నారు. 

రాహుల్, పంత్ నాలుగో వికెట్ కు అజేయంగా 173 పరుగులు జోడించి ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్తున్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో కార్స్ రెండు,, స్టోక్స్ ఒక వికెట్ పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 471.. ఇంగ్లాండ్ 465 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.