
లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ సెంచరీతో దుమ్ములేపాడు. రెండో ఇన్నింగ్స్ లో భాగంగా తీవ్ర ఒత్తిడిలో ఎంతో ఓపిగా బ్యాటింగ్ చేసిన రాహుల్.. 202 బంతుల్లో 13 ఫోర్లతో తన సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఇన్నింగ్స్ 62 ఓవర్ బషీర్ వేసిన చివరి బంతికి కవర్స్ దిశగా రెండు పరుగులు రాబట్టి టెస్ట్ కెరీర్ లో 9 వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రాహుల్ శతకానికి తోడు పంత్ కూడా బ్యాట్ ఝులిపించడంతో భారత్ రెండో ఇన్నింగ్స్ లో ప్రస్తుతం 3 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. రాహుల్ (100), పంత్ (82) క్రీజ్ లో ఉన్నారు.
ALSO READ | ENG vs IND 2025: నిలకడగా రాహుల్, పంత్.. 150 పరుగులు దాటిన టీమిండియా ఆధిక్యం
ప్రస్తుతం భారత్ 240 పరుగుల ఆధిక్యంలో ఉంది. చేతిలో 7 వికెట్లు ఉండడంతో ఈ మ్యాచ్ మన చేతుల్లోనే ఉంది. 350 నుంచి 400 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ కు నిర్ధేశించినట్టయితే ఈ మ్యాచ్ లో విజయం సాధించవచ్చు. 3 వికెట్ల నష్టానికి 153 పరుగులతో నాలుగో రోజు రెండో సెషన్ ప్రారంభించిన భారత్.. పరుగులు చేయడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు. ఆరంభం నుంచి పంత్ బౌండరీలతో చెలరేగాడు. తొలి సెషన్ లో స్లో గా ఆడిన రాహుల్ సైతం తన వేగాన్ని పెంచాడు. రాహుల్, పంత్ నాలుగో వికెట్ కు అజేయంగా 142 పరుగులు జోడించడం విశేషం. ఇంగ్లాండ్ బౌలర్లలో కార్స్ రెండు,, స్టోక్స్ ఒక వికెట్ పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 471.. ఇంగ్లాండ్ 465 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
TOP QUALITY TON!
— ESPNcricinfo (@ESPNcricinfo) June 23, 2025
A third Test hundred in England for KL Rahul 👏
🔗 https://t.co/ShJazRf4lJ pic.twitter.com/xWQh6E8sKl