రాష్ట్రంలో విజృంభిస్తున్న విషజ్వరాలు

రాష్ట్రంలో విజృంభిస్తున్న విషజ్వరాలు

రాష్ట్రంలో విషజ్వరాలు విజృంభిస్తున్నయి. డెంగ్యూ తో 8 నెలల గర్భిణీ మృతిచెందిన ఘటన సిటీలోని యశోదా హాస్పిటల్ లో చోటుచేసుకుంది.  మేడ్చల్ జిల్లా కీసర మండలం అంకిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన కె స్వాతి, డెంగ్యూ తో బాధపడుతూ యశోద హాస్పిటల్ లో జాయిన్ అయింది. పరిస్థితి విషమించడంతో ఇవాళ ఉదయం చనిపోయింది. నిండు గర్భిణీ మృతి చెందడంతో కన్నీరు మున్నీరవుతున్నారు కుటుంబ సభ్యులు.