ఇద్దరికి మించి పిల్లలుంటే అనర్హులను చేయాలె: ఎన్‌‌‌‌‌‌‌‌సీపీ నేత అజిత్ పవార్ 

ఇద్దరికి మించి పిల్లలుంటే అనర్హులను చేయాలె: ఎన్‌‌‌‌‌‌‌‌సీపీ నేత అజిత్ పవార్ 

ముంబై : ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్నవారికి ప్రభుత్వం తరఫున ఎలాంటి రాయితీ ఇవ్వకూడదని, అటువంటివారిని ఎంపీ, ఎమ్మెల్యేల ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు అనర్హులుగా ప్రకటించాలని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌‌‌‌‌‌‌‌సీపీ) నేత అజిత్ పవార్ డిమాండ్ చేశారు. జనాభాలో  చైనాను ఇండియా అధిగమించిందన్నారు. బారామతిలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చినప్పుడు మన దేశ జనాభా 35 కోట్లు కాగా.. ప్రస్తుతం142 కోట్లకు చేరుకుందని గుర్తుచేశారు. మన దేశం, రాష్ట్రం, జిల్లా, ప్రాంతం అభివృద్ధి చెందాలంటే.. ఒకరిద్దరు పిల్లలకే పరిమితం కావాలని సూచించారు. ఇక నుంచి ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారికి ఎలాంటి రాయితీలు ఇవ్వకూడదని చెప్పారు.