
శంషాబాద్, వెలుగు: శంషాబాద్ మండలంలోని ప్రజా పరిషత్ ఆఫీసులో సోమవారం బీసీ బంధు చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్తో కలిసి జడ్పీటీసీ ఫ్లోర్ లీడర్ నీరటి తన్విరాజు లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రాష్ట్ర సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా బీసీ బంధును అమలు చేస్తున్నదన్నారు.
ఈ స్కీమ్ను అర్హులైన బీసీలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ జయమ్మ, ఎంపీపీ నీలా మోహన్ నాయక్, మండల అధికారులు, గ్రామ సర్పంచ్లు, ఎంపీటీసీలు, బీసీ బంధు లబ్ధిదారులు పాల్గొన్నారు.