జనగామలో డిసెంబర్ 21న జిల్లా స్థాయి సైక్లింగ్​ పోటీలు

జనగామలో డిసెంబర్ 21న జిల్లా స్థాయి సైక్లింగ్​ పోటీలు

జనగామ అర్బన్, వెలుగు: ఈ నెల 21న జిల్లా స్థాయి సైక్లింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు జనగామ జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ కార్యదర్శి ఐత కిషన్ తెలిపారు. లింగాలఘనపురం బైపాస్ రోడ్​లో జరిగే పోటీల్లో ప్రతిభ కనబరిచనవారు సిద్దిపేటలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని చెప్పారు.

గురువారం ఉదయం 9 గంటలకు పోటీలు మొదలవుతాయన్నారు. ఆసక్తి ఉన్నవారు సొంత సైకిళ్లతో పాటు బర్త్, బోనాఫైడ్​ సర్టిఫికెట్లు వెంట తెచ్చుకోవాలని సూచించారు. వివరాలకు 91824 59617 కాల్​చేయొచ్చన్నారు.