గొత్తికోయ గ్రామంలో జిల్లా స్పెషల్​ ఆఫీసర్ పర్యటన

గొత్తికోయ గ్రామంలో జిల్లా స్పెషల్​ ఆఫీసర్ పర్యటన

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : లక్ష్మీదేవిపల్లి మండలంలోని గొత్తికోయల గ్రామంలో జిల్లా స్పెషల్​ ఆఫీసర్​ సురేంద్రమోహన్​ మంగళవారం పర్యటించారు. క్రాంతినగర్​ హ్యాబిటేషన్​లో జరుగుతున్న ఉపాధి హామీ పనులు పరిశీలించారు. గ్రామపంచాయతీ కల్పిస్తున్న సౌకర్యాల గురించి కూలీలను అడిగి తెలుసుకున్నారు. ఎండలో విశ్రాంతి కోసం వేసిన షెడ్​ నెట్​ను పరిశీలించారు. రోజూ కూలి రూ. 300 వచ్చేలా పని చేయాలని ఆయన సూచించారు.

క్రాంతినగర్​లో నివసిస్తున్న గొత్తికోయలతో మాట్లాడారు. తాగు నీటి ఎద్దడి నివారణకు అధికారులు తీసుకుంటున్న చర్యలను అభినందించారు. 30 మంది పిల్లలున్నా అంగన్​వాడీ కేంద్రం లేకపోవడంతో అక్కడ ప్రత్యేకంగా అంగన్​వాడీ స్కూల్​ ఏర్పాటుకు పరిశీలన చేయాలని ఆఫీసర్లకు సూచించారు. ఈ ప్రోగ్రాంలో డీఆర్​డీవో విద్యాచందన, ఎంపీడీవో చలపతిరావు, ఎంపీవో శ్రీనివాసరావు, ఏఈఈ వెంకటస్వామి, గ్రామపంచాయతీ సెక్రటరీ కే. వంశీకృష్ణ పాల్గొన్నారు.