
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల కేంద్రంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మహబూబ్నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి, బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ మండల కేంద్రంలో ఒకేసారి రోడ్ షో నిర్వహించారు. ఈ క్రమంలో ఇద్దరు అభ్యర్థులు ఎదురుపడడంతో ఇరుపార్టీల కార్యకర్తలు తమ లీడర్లకు అనుకూలంగా పోటాపోటీగా నినాదాలు చేశారు. దీంతో రెండు పార్టీలకు చెందిన కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. మండల కేంద్రంలో కొద్దిసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది. రెండు పార్టీలకు చెందిన లీడర్లకు పోలీసులు నచ్చచెప్పి పక్కకు పంపించడంతో పరిస్థితి సద్దుమణిగింది.