సిట్​ కేసీఆర్​ జేబు సంస్థ:డీకే అరుణ

సిట్​ కేసీఆర్​ జేబు సంస్థ:డీకే అరుణ

హైదరాబాద్, వెలుగు: టీఎస్​పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారంలో మంత్రి కేటీఆర్​తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. శనివారం పార్టీ స్టేట్​ ఆఫీసులో మీడియాతో ఆమె మాట్లాడారు. సిట్​ కేసీఆర్​ జేబు సంస్థ అని, దానితో ఉపయోగం లేదన్నారు. పేపర్ల లీకేజీలో సిట్టింగ్​ జడ్జితో విచారణ జరిపించాలని, 30 లక్షల మంది నిరుద్యోగులకు రూ.లక్ష చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ ​చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును ముంచేశారని, ఆ ప్రాజెక్టును ముందుగా రాష్ట్ర ప్రజలకు ముందుగా చూపించాలన్నారు. రైతులకు ఇవ్వాల్సిన అన్ని సబ్సిడీలను బంద్​ చేశారన్నారు.