రామ భక్తుల కల నెరవేరింది : డీకే అరుణ

రామ భక్తుల కల నెరవేరింది : డీకే అరుణ

పాలమూరు, వెలుగు: అయోధ్యలో రామ మందిర నిర్మాణంతో దేశంలోని లక్షలాది మంది రామభక్తుల కల నెరవేరిందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పేర్కొన్నారు. గురువారం మహబూబ్​నగర్  రైల్వేస్టేషన్లో అయోధ్య దర్శనం కోసం ఏర్పాటు చేసిన ఆస్తా స్పెషల్  ఎక్స్​ప్రెస్  రైలును జెండా ఊపి ప్రారంభించారు.

జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు చేసిన జై శ్రీరాం నినాదాలతో రైల్వే స్టేషన్  ప్రాంగణం మార్మోగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అయోధ్యకు వెళ్లేందుకు భక్తులు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారని, కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి మరో రెండు రైళ్లను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు.  ట్రైన్​లో భోజన వసతి ఏర్పాటు చేశామని, ప్రతి బోగీకి ఇన్​చార్జిని నియమించామని చెప్పారు. ఏపీ మిథున్ రెడ్డి, పద్మజారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.