వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వద్దు : నరేందర్‌‌‌‌‌‌‌‌ రాథోడ్‌‌‌‌‌‌‌‌

వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వద్దు : నరేందర్‌‌‌‌‌‌‌‌ రాథోడ్‌‌‌‌‌‌‌‌

గుడిహత్నూర్,వెలుగు :   వైద్య సేవలు అందించడంలో   నిర్లక్ష్యం గా ఉండొద్దని    డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌ఓ రాథోడ్‌‌‌‌‌‌‌‌ నరేందర్‌‌‌‌‌‌‌‌ సూచించారు. సోమవారం మండల కేంద్రంలోని పీహెచ్‌‌‌‌‌‌‌‌సీని ఆయన  తనిఖీ చేశారు. ఈ సందర్భంగా  రికార్డులను పరిశీలించారు.   పీహెచ్‌‌‌‌‌‌‌‌సీలో జరుగుతున్న ప్రసవాల గురించి మెడికల్‌‌‌‌‌‌‌‌ఆఫీసర్‌‌‌‌‌‌‌‌శ్యాంసుందర్‌‌‌‌‌‌‌‌ను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఆశ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గర్భిణుల ఆరోగ్యాన్ని పట్ల ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని  , ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకురావాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఫార్మసిస్ట్‌‌‌‌‌‌‌‌ శివాజీ,  సూపర్​వైజర్లు రవీందర్, అన్నపూర్ణ,వైద్య సిబ్బంది ఉన్నారు.