సభలో మహాభారత కథలు చెప్పకండి

సభలో మహాభారత కథలు చెప్పకండి
  • ప్రశ్నలు సూటిగా అడగండి : లోక్​సభ స్పీకర్​ ఓంబిర్లా 

న్యూఢిల్లీ: లోక్​సభ సమావేశాల్లో భాగంగా స్పీకర్​ ఓంబిర్లా ఓ ఎంపీపై ఫైర్​ అయ్యారు. సభలో మహాభారత కథలు చెప్పొద్దని, అడగాలనుకున్న ప్రశ్నలు సూటిగా అడగాలని సూచించారు. ఒడిశాకు చెందిన బీజేపీ ఎంపీ బార్గర్​ ప్రదీప్​ పురోహిత్​ ఆయుర్వేదిక్​కళాశాలపై కేంద్ర ఆయుష్​ మంత్రిత్వ శాఖ మంత్రికి ఓ ప్రశ్న సంధించారు. ఈ సందర్భంగా ఆయన ఆ కళాశాల ప్రాంతంలో పురాతన కాలంలో కొన్ని మూలికలు లభించేవంటూ చరిత్ర వల్లెవేశారు. 

దీంతో స్పీకర్​ కలుగ జేసుకొని, విషయాలను సూటిగా ప్రస్తావించాలని, సభలో కథలు చెప్పొద్దని ఘాటుగా చెప్పారు. ఈ మధ్య సభలో మహాభారతం చెప్పడం ఫ్యాషనైపోయిందని వ్యాఖ్యానించారు.  కాగా, సోమవారం లోక్​ సభ సమావేశాల్లో ప్రతిపక్ష నేత రాహుల్‌‌‌‌‌‌ గాంధీ  మాట్లాడుతూ.. మహాభారతంలోని చక్రవ్యూహం గురించి ప్రస్తావించారు. ఆరుగురు వ్యక్తులు దేశం మొత్తాన్ని ‘పద్మవ్యూహం’లోకి నెట్టివేస్తున్నారని ఫైర్​ అయ్యారు.  ఈ నేపథ్యంలో తాజాగా స్పీకర్ చేసిన​కామెంట్స్​ప్రాధాన్యత సంతరించుకున్నాయి.