
శ్రావణమాసం కొనసాగుతోంది. శుక్ల పక్షం ముగిసింది.. కృష్ణ పక్షంలోకి ఆగస్టు 10న అడుగుపెట్టాం..శ్రావణమాసం మూడవ మంగళవారం ఆగస్టు 12వ తేదీన వస్తుంది. ఆ రోజున మంగళగౌరీ వ్రతం ఆచరించడం ఆనవాయితీ. పురాణాల ప్రకారం ఈ వ్రతాన్ని పార్వతిదేవి ఆచరించిందని పండితులు చెబుతున్నారు.
శ్రావణమాసంలో మంగళవారం మంగళగౌరీ వ్రతం ఆచరిస్తారు. ఈ వ్రతం ముఖ్యంగా స్త్రీలు తమ సౌభాగ్యం కోసం, భర్త క్షేమం కోసం ఆచరిస్తారు. అలానే పార్వతిదేవి కూడా ఈ వ్రతం ఆచరించింది. ఈ వ్రతాన్ని వివాహం జరిగిన తరువాత మొదటి సంవంత్సరం నుంచి ఐదేళ్లు ఆచరించి, ఆరో సంవత్సరంలో ఉద్యాపన చేయాలి. ఈ వ్రతంలో మంగళగౌరీ దేవిని పూజిస్తారు. దీనినే శ్రావణ మంగళవారం వ్రతం అని కూడా అంటారు.
శ్రావణమాసం మంగళవారాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ వ్రతం పార్వతిదేవి ఆచరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈఏడాది శ్రావణమాసం మూడవ మంగళవారం, అంటే ఆగస్టు 12వ తేదీన, వస్తుంది, శ్రావణమాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలలో ఒకటి, దీనిని స్త్రీలు తమ సౌభాగ్యం కోసం జరుపుకుంటారు.
శ్రావణమాసంలో ప్రతి మంగళవారం ఈ వ్రతాన్ని ఆచరించాలని శాస్త్రాల ద్వారా తెలుస్తోంది. ఈ వ్రతాన్ని చేసిన వారికి సౌభాగ్యం కలకాలం నిలుస్తుందని నమ్మకం. అందుకే కొత్తగా పెళ్లయిన వారు మంగళగౌరీ వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్దలతో చేస్తారు.
►ALSO READ | కిచెన్ తెలంగాణ: సోయాచంక్స్తో పకోడీ, మంచూరియా, టిక్కీ.. టేస్టీగా, సింపుల్గా ఇలా ప్రిపేర్ చేయండి !
పురాణాల ప్రకారం పరమేశ్వరుడు కూడా మంగళగౌరీ దేవిని పూజించి త్రిపురాంత సంహారం చేశాడని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. వివాహమైన తరువాత మొదటి సంవత్సరం ఈ వ్రతాన్ని ఆచరించే మహిళలు పుట్టింట్లో చేయాలి. తొలిసారిగా ఈ వ్రతాన్ని చేసే వారు తల్లికి వాయినం ఇవ్వాలి. అలా కాని పక్షంలో అత్తగారికి కాని.. ఇతర ముత్తైదువులకు కాని వాయనం అందిస్తారు.
వ్రత నియయాలు:
- వ్రతం చేసుకునే ముందు రోజు, వ్రతం రోజు కూడా భార్యాభర్తలు దాంపత్య సుఖానికి దూరంగా ఉండాలి.
- వ్రతం రోజు వ్రతం చేసుకునే మహిళలు ఉపవాసం చేయాలి.
- వ్రతానికి ఐదుగురు ముత్తైదువులను పిలిచి వాయనం ఇవ్వాలి.
- వ్రతం చేసుకునే అన్ని మంగళవారాలలో ఒకే మంగళ గౌరీ దేవి విగ్రహాన్ని ఉపయోగించాలి.
- మంగళవారం వాయినం ఇచ్చేటప్పుడు పసుపు కుంకుమలు ఇవ్వరు. ఎందుకంటే సౌభోగ్యం కోసం చేసే వ్రతం కాబట్టి పసుపు కుంకుమలు ఇవ్వడం మంచిది కాదని భావిస్తారు.