Karnataka : ఇదేం ఘోరం : ఆస్పత్రిలో పుట్టిన బిడ్డను కరిచి చంపిన కుక్క

Karnataka :  ఇదేం ఘోరం : ఆస్పత్రిలో పుట్టిన బిడ్డను కరిచి చంపిన కుక్క

కర్ణాటకలో దారుణం జరిగింది. శివమొగ్గ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రసూతి వార్డులోకి వచ్చిన ఓ కుక్క అప్పుడే పుట్టిన బిడ్డను నోటకరచుకొని ఈడ్చుకెళ్లింది. ఉదయం 7 గంటల సమయంలో కుక్క ఆ బిడ్డను  నోటకరచుకొని ప్రసూతి వార్డు చుట్టూ తిరగడాన్ని సెక్యూరిటీ గార్డు గమనించారు. వెంటనే ఆ కుక్కను తరమికొట్టి బిడ్డను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆ బిడ్డ చనిపోయినట్లుగా వైద్యులు గుర్తించారు. అయితే కుక్క వల్లే ఆ బిడ్డ చనిపోయిందా లేకపోతే అంతకుముందే చనిపోయిందా అనే దానిపై  అధికారులు ఆరా తీస్తున్నారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం తర్వాతే ఆ బిడ్డ మృతికి గల కారణాలు తెలియరానున్నాయి.  ఆ శిశువు తల్లిదండ్రుల వివరాలు ఇంకా  తెలియరాలేదు. ఆసుపత్రి ప్రసూతి వార్డు వెనుక భాగంలో శిశువును వదిలివేసినట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. అన్ని ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రులలో  గర్భిణుల రికార్డులను పరిశీలిస్తున్నారు.  ఓ రెండు నెలల క్రితం హైదరాబాద్ లో నడుచుకుంటూ వెళ్తున్న 8 సంవత్సరాల బాలుడిపై  వీధి కుక్కలు దాడి చేశాయి. దీంతో  ఆ బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు.