రాష్ట్రంలో అధికారాన్ని వాడుకుని వ్యాపారాలు చేస్తున్నరు: ప్రొ. కోదండరామ్

రాష్ట్రంలో అధికారాన్ని వాడుకుని వ్యాపారాలు చేస్తున్నరు: ప్రొ. కోదండరామ్

టీఎస్పీఏస్సీ అక్రమాలకు కెరాఫ్ అడ్రెస్ గా మారిందని, ప్రశ్నపత్రాల లీకేజీ వర్తమాన తెలంగాణకు సాక్షిగా నిలుస్తోందని ప్రొ. కోదండరామ్ ఆరోపించారు. ప్రశ్నాపత్రాల లీకేజీలకు టీఎస్పీఎస్సీ చైర్మన్ ను బాధ్యునిగా చేస్తూ అతనిపై చర్యలు తీసుకోవాలని, లీకేజీ కుంభకోణాన్ని సీబీఐకి అప్పగించాలని కోదండరామ్ కోరారు. పాలకుల తీరుతో నిరుద్యోగులకు భవిష్యత్ మీద నమ్మకం పోయింది. రాష్ట్రంలో అధికారాన్ని వాడుకుని వ్యాపారాలు చేస్తున్నారని కోదండరామ్ అన్నారు.

ఆంధ్రా నేతలు ఆటంకంగా నిలిచారని తరిమికొట్టిన తెలంగాణ బిడ్డలు.. తెలంగాణకు అడ్డంకిగా మారిన పాలకులను గద్దె దించాలని ప్రజలను కోరారు. నీళ్ల పేరుతో కాళేశ్వరంలో కమీషన్లు, నిధుల కోసం భూదందాలు, నియామకాల పేరున లీకేజీల వ్యాపారం చేస్తున్నారని కోదండరామ్  ప్రభుత్వంపై మండి పడ్డారు.

మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె, సాగర హారం లాంటివి చేపడితే.. అవన్నీ పక్కన బెట్టిన ప్రభుత్వం..  తెలంగాణ నాది అన్నట్టుగా భవిష్యత్తును నలిపేస్తుంటే చూస్తూ ఊరుకొమని ద్వజమెత్తారు. నిరంకుశాన్ని కూలదోసినప్పుడే ప్రజాస్వామ్య పాలన సాధ్యమవుతుందన్న ఆయన.. తెలంగాణ బచావో పేరుతో ప్రజాస్వామ్య తెలంగాణకు పురుడు పోస్తామని తెలిపారు.