
తెలుగు, తమిళ భాషల్లో వరుస అవకాశాలతో దూసుకెళుతోంది కయాదు లోహర్. మూడేళ్ల క్రితమే శ్రీవిష్ణుకు జంటగా ‘అల్లూరి’ చిత్రంలో ఆమె నటించినా అంతగా గుర్తింపు దక్కలేదు. ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన తమిళ చిత్రం ‘డ్రాగన్’తో మాత్రం అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్లో క్రేజీ హీరోయిన్గా మారింది. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులు చేస్తోంది.
రీసెంట్గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది. ప్రస్తుతం తాను.. కేవీ అనుదీప్ దర్శకత్వంలో విశ్వక్ సేన్కు జంటగా ‘ఫంకీ’ సినిమా చేస్తున్నాని చెప్పింది. కంప్లీట్ కామెడీ బ్యాక్డ్రాప్లో ఈ మూవీ తెరకెక్కుతోందని చెప్పిన కయాదు.. ‘ఈ చిత్రంలో ప్రతి ఐదు నిమిషాలకు వచ్చే సీన్ చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఇందులోని డైలాగ్స్ను స్ర్కిప్ట్తో సంబంధం లేకుండా షూటింగ్ స్పాట్లోనే దర్శకుడు స్పాంటేనియస్గా రాసేవారు.
ఇప్పటివరకు నేను ఆడియెన్స్ను నవ్వించగలనని భావించేదాన్ని. కానీ ఈ మూవీ సెట్స్లోనే కామెడీ చేయడం ఎంత కష్టమో నాకు తెలిసింది. కామెడీ ఎంత నేచురల్గా ఉంటే అంత ఫన్ జనరేట్ అవుతుంది. అందుకు తగ్గట్టుగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు’ అని చెప్పింది. అలాగే టోవినో థామస్కు జంటగా ఓ మలయాళ చిత్రంలో నటిస్తున్నట్టు చెబుతూ అది పీరియాడికల్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతోందని తెలియజేసింది. మరోవైపు కోలీవుడ్లో శివకార్తికేయన్తో ఓ మూవీ, టాలీవుడ్లో నాని ‘ది ప్యారడైజ్’ చిత్రాలతో పాటు రవితేజ కొత్త చిత్రంలోనూ కయాదు లోహర్ నటిస్తుందని తెలుస్తోంది.