- కాంగ్రెస్ అభ్యర్థి బుట్టి లావణ్యరమేశ్
వేములవాడ, వెలుగు: కాలం చెల్లిన బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు ఓటేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదని, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్కు ఓటేస్తే అభివృద్ధి జరుగుతుందని 27వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి బుట్టి లావణ్య రమేశ్ అన్నారు. శుక్రవారం భగవంతరావునగర్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనను గెలిపిస్తే నాయకురాలిగా కాకుండా సేవకురాలిగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక విప్, ఎమ్యెల్యే ఆది శ్రీనివాస్నాయకత్వంలో అభివృద్ది చెందుతోందన్నారు. వార్డు ప్రజలకు ఎలాంటి కష్టమొచ్చినా అండగా ఉంటానని, ఒక్కసారి అవకాశం ఇచ్చి గెలిపించాలని కోరారు.
