పన్నులు వేయడంలో భారత్ ఫస్ట్ : ట్రంప్

పన్నులు వేయడంలో భారత్ ఫస్ట్ : ట్రంప్

వాష్టింగన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌ పై మరోసారి నోరు పారేసుకున్నారు. అమెరికా ఉత్పత్తులపై భారత్ అధిక పన్నులు వేస్తోందన్నారు. పన్నులు వేయడంలో భారత్ మొదటి స్థానంలో ఉందని ఎగతాలి చేశాడు. భారత్, చైనా, జపాన్ లాంటి దేశాలు అధిక పన్నులు వేయడం వల్ల అమెరికాకు లక్షల డాలర్ల నష్టం వస్తోందని తెలిపారు ట్రంప్. వైఖరి మార్చుకోకపోతే.. ఇండియా నుంచి అమెరికాకు దిగుమతి అవుతున్న ఉత్పత్తులపై తాము కూడా పన్నులు వేస్తామని చెప్పారు.