సీఎన్ఎన్ పై రూ. 3,864 కోట్ల పరువు నష్టం దావా

 సీఎన్ఎన్ పై రూ.  3,864 కోట్ల పరువు నష్టం దావా

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్...  సీఎన్ఎన్  నెట్ వర్క్  పై పరువు నష్టం దావా వేశారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో తనను ఓడించాలన్న ఉద్దేశంతో ఈ నెట్ వర్క్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపిస్తున్నారు. సీఎన్ఎన్ నెట్ వర్క్ తనను జాత్యహంకారిగా, రష్యాకు బానిసగా, హిట్లర్ తో పోలుస్తోందన్నారు.  

475 మిలియన్ డాలర్లకు(ఇండియన్ కరెన్సీ ప్రకారం 3,864 కోట్లు) పైగా నష్ట పరిహారం కోరుతూ దక్షిణ ఫ్లోరిడాలోని ఫెడరల్ కోర్టులోట్రంప్  కేసు వేశారు.  29 పేజీలతో కూడిన దావాను ట్రంప్‌ తరఫున న్యాయవాదులు దాఖలు చేశారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో సీఎన్ఎన్ తో పాటుగా ఇతర మీడియా  సంస్థల పై విమర్శలు గుప్పిస్తూనే వచ్చారు.