మెదక్ పట్టణంలో నాలుగు రోజులుగా నీళ్లు రాకున్నా పట్టించుకోరా? : మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి

మెదక్ పట్టణంలో నాలుగు రోజులుగా నీళ్లు రాకున్నా పట్టించుకోరా? : మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి

 మెదక్​ టౌన్, వెలుగు: మెదక్​ పట్టణంలో నాలుగు రోజులుగా మిషన్​ భగీరథ నీళ్లు రాకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం ఎంత వరకు సమంజసమని బీఆర్​ఎస్​ మెదక్​ జిల్లా ప్రెసిడెంట్​, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్​ రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్​ గౌడ్,  పట్టణ కన్వీనర్ ఆంజనేయులు, మాజీ కౌన్సిలర్లతో కలిసి అడిషనల్ కలెక్టర్ నగేశ్​ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇలాంటి అవస్థ ఎప్పుడు రాలేదన్నారు. కేవలం ఏడాదిన్నర కాంగ్రెస్​ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వెంటనే నీళ్లు అందించకపోతే బీఆర్​ఎస్​ ఆధ్వర్యంలో ధర్నా చేస్తామని హెచ్చరించారు  విశ్వం, జయరాజ్, శ్రీనివాస్, కిషోర్, మల్లేశం, లింగారెడ్డి, జుబేర్, ప్రభురెడ్డి, మధు, జగదీశ్, రవి, అమీర్, వేణు, రంజిత్  పాల్గొన్నారు.