
మెదక్ టౌన్, వెలుగు: మెదక్ పట్టణంలో నాలుగు రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం ఎంత వరకు సమంజసమని బీఆర్ఎస్ మెదక్ జిల్లా ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, పట్టణ కన్వీనర్ ఆంజనేయులు, మాజీ కౌన్సిలర్లతో కలిసి అడిషనల్ కలెక్టర్ నగేశ్ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇలాంటి అవస్థ ఎప్పుడు రాలేదన్నారు. కేవలం ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వెంటనే నీళ్లు అందించకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేస్తామని హెచ్చరించారు విశ్వం, జయరాజ్, శ్రీనివాస్, కిషోర్, మల్లేశం, లింగారెడ్డి, జుబేర్, ప్రభురెడ్డి, మధు, జగదీశ్, రవి, అమీర్, వేణు, రంజిత్ పాల్గొన్నారు.