మూసీ తీరాన ఉండే 10 వేల మందికి డబుల్ ఇండ్లు: మంత్రి కేటీఆర్

మూసీ తీరాన ఉండే 10 వేల మందికి డబుల్ ఇండ్లు: మంత్రి కేటీఆర్
  • గ్రేటర్ మంత్రులు, ఎమ్మెల్యేలతో సిటీ అభివృద్ధి, భవిష్యత్ పై చర్చ 

హైదరాబాద్, వెలుగు: మూసీ నది ఒడ్డున నివసించే 10 వేలమంది పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అందించాలని మంత్రి కేటీఆర్ నిర్ణయించారు. గ్రేటర్ పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలతో మంత్రి గురువారం భేటీ అయి పలు సూచనలు చేశారు. సిటీలో జరిగిన అభివృద్ధి, భవిష్యత్ లో ఏం చేయాలనేదానిపైనా చర్చించారు. మూసీపైన కబ్జాలను తొలగించేలా ప్రత్యేకంగా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యేలకు మంత్రి సూచించారు. 
మూసీ ప్రాజెక్టు అభివృద్ధికి ప్రాథమిక ప్లానింగ్ ని  ప్రభుత్వం పూర్తి చేసిందని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రకటించిన విధంగా వచ్చేవారంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ ప్రభుత్వం ప్రారంభిస్తుందని వివరించారు. ఆయా నియోజకవర్గాల్లో గుర్తించిన లబ్ధిదారులకు  పంపిణీ చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డిలతో పాటు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.