రంగారెడ్డి కలెక్టరేట్​లో ఆగస్టు 30న డబుల్ ఇండ్లకు డ్రా

రంగారెడ్డి కలెక్టరేట్​లో ఆగస్టు 30న డబుల్ ఇండ్లకు డ్రా
  • రంగారెడ్డి కలెక్టరేట్​లో ఆగస్టు 30న డబుల్ ఇండ్లకు డ్రా 

రంగారెడ్డి కలెక్టరేట్​, వెలుగు : రాజేంద్రనగర్, ఎల్​బీనగర్, మహేశ్వరం, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లోని డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికకు బుధవారం డ్రా తీయనున్నట్టు రంగారెడ్డి కలెక్టర్​ హరీశ్ తెలిపారు. ఇప్పటికే నాలుగు నియోజకవర్గాల నుంచి  93,899 అప్లికేషన్లు అందాయని పేర్కొన్నారు. 

మొదటి విడతగా అర్హత సాధించిన 12,479 దరఖాస్తుల్లో ఒక్కో సెగ్మెంట్​కు 500 లబ్ధిదారుల చొప్పున మొత్తం 2 వేల మందిని ఎంపిక చేస్తామని చెప్పారు. కొంగరకలాన్​లోని  కలెక్టరేట్​లో విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి సమక్షంలో డ్రా కార్యక్రమం నిర్వహించనున్నట్టు కలెక్టర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.