DRDO చీఫ్ సతీష్ రెడ్డికి దక్కిన అరుదైన గౌరవం

DRDO చీఫ్ సతీష్ రెడ్డికి దక్కిన అరుదైన గౌరవం

DRDO Chairman Satheesh Reddy to be honoured with Missile Systems Award by US Based AIAAఅమెరికన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటిక్స్, అండ్ ఆస్ట్రోనాటిక్స్ అందించే ప్రఖ్యాత మిసైల్ సిస్టమ్స్ అవార్డు 2019కు DRDO చీఫ్ సతీష్ రెడ్డి ఎంపికయ్యారు. భారత క్షిపణి రంగంలో సతీష్ రెడ్డి పాత్రకు గుర్తింపుగా ఈ అవార్డు దక్కింది. మిసైల్ సిస్టమ్ టెక్నాలజీలో గత 3 దశాబ్దాలుగా అసాధారణ ప్రతిభ చూపుతున్నందుకు, దేశీయంగా క్షిపణుల తయారీ, అభివృద్ధి, ప్రయోగాల విషయంలో చూపిన ప్రతిభకు గుర్తింపుగా అవార్డుకు ఎంపిక చేసినట్లు అమెరికన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఏరో నాటిక్స్, అండ్ ఆస్ట్రోనాటిక్స్ సొసైటీ తెలిపింది.