
అమెరికన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటిక్స్, అండ్ ఆస్ట్రోనాటిక్స్ అందించే ప్రఖ్యాత మిసైల్ సిస్టమ్స్ అవార్డు 2019కు DRDO చీఫ్ సతీష్ రెడ్డి ఎంపికయ్యారు. భారత క్షిపణి రంగంలో సతీష్ రెడ్డి పాత్రకు గుర్తింపుగా ఈ అవార్డు దక్కింది. మిసైల్ సిస్టమ్ టెక్నాలజీలో గత 3 దశాబ్దాలుగా అసాధారణ ప్రతిభ చూపుతున్నందుకు, దేశీయంగా క్షిపణుల తయారీ, అభివృద్ధి, ప్రయోగాల విషయంలో చూపిన ప్రతిభకు గుర్తింపుగా అవార్డుకు ఎంపిక చేసినట్లు అమెరికన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఏరో నాటిక్స్, అండ్ ఆస్ట్రోనాటిక్స్ సొసైటీ తెలిపింది.