దుబాయ్‌లో స్కూబా డైవింగ్ చేస్తుండగా గుండెపోటు..కేరళ యువకుడి మృతి

దుబాయ్‌లో స్కూబా డైవింగ్ చేస్తుండగా గుండెపోటు..కేరళ యువకుడి మృతి

న్యూఢిల్లీ: దుబాయ్‌‌లో స్కూబా డైవింగ్​కు వెళ్లిన కేరళ ఇంజనీర్ మృత్యువాత పడ్డాడు. జుమైరా బీచ్ వద్ద ఈ ఘటన జరిగింది.కేరళకు చెందిన ఇసాక్ పాల్ (29), ఆయన భార్య రేషంతో కలిసి దుబాయ్​లో నివసిస్తున్నాడు. ఇసాక్ తమ్ముడు ఇవిన్ అబుదాబీలో ఉంటున్నాడు.

ఈద్ సందర్భంగా సెలవు రావడంతో  అన్నావదినలతో సరదాగా గడిపేందుకు ఇవిన్ దుబాయ్ వచ్చాడు. ముగ్గురూ కలిసి జుమైరా బీచ్‌‌లో స్కూబా డైవింగ్ ట్రైనింగ్ సెషన్​లో పాల్గొన్నాడు. ముగ్గురూ నీటిలో అడుగు వరకు వెళ్లారు. నీటిలోపల ఆక్సిజన్ అందక ఇబ్బందిపడ్డ ఇసాక్ ​గుండెపోటుతోచనిపోయాడు.