
న్యూఢిల్లీ: దుబాయ్లో స్కూబా డైవింగ్కు వెళ్లిన కేరళ ఇంజనీర్ మృత్యువాత పడ్డాడు. జుమైరా బీచ్ వద్ద ఈ ఘటన జరిగింది.కేరళకు చెందిన ఇసాక్ పాల్ (29), ఆయన భార్య రేషంతో కలిసి దుబాయ్లో నివసిస్తున్నాడు. ఇసాక్ తమ్ముడు ఇవిన్ అబుదాబీలో ఉంటున్నాడు.
ఈద్ సందర్భంగా సెలవు రావడంతో అన్నావదినలతో సరదాగా గడిపేందుకు ఇవిన్ దుబాయ్ వచ్చాడు. ముగ్గురూ కలిసి జుమైరా బీచ్లో స్కూబా డైవింగ్ ట్రైనింగ్ సెషన్లో పాల్గొన్నాడు. ముగ్గురూ నీటిలో అడుగు వరకు వెళ్లారు. నీటిలోపల ఆక్సిజన్ అందక ఇబ్బందిపడ్డ ఇసాక్ గుండెపోటుతోచనిపోయాడు.