
బలవంతుడైన శత్రువును కొట్టాలంటే బలం పెంచుకోవటం కాదు.. బుద్ధి బలం చూపించాలనే చాణుక్యుడి సూత్రాన్ని అక్షరాల అమలు చేసి.. ప్రపంచ దేశాలను ఔరా అనిపించింది ఉక్రెయిన్. రెండేళ్లుగా రష్యా దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఉక్రెయిన్.. అత్యంత వ్యూహాత్మకంగా..టెక్నాలజీ సాయం..డ్రోన్లతో రష్యాలోని యుద్ధ విమానాలను పేల్చేయటం అనేది అందరినీ షాకింగ్ కు గురి చేస్తోంది. 4 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఉక్రెయిన్ ఎలా సాధ్యం చేసింది.. ఎలాంటి టెక్నాలజీ ఉపయోగించింది.. హాలీవుడ్ మూవీ తరహాలో ఉక్రెయిన్ చేసిన ఆపరేషన్.. జేమ్స్ బాండ్ సినిమాలను సైతం తలదన్నెలా ఉంది.. అసలు ఉక్రెయిన్ ఎటాక్ వ్యూహం వివరంగా తెలుసుకుందాం..
ఆదివారం(జూన్1) రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్లతో విరుచుపడింది. రష్యా, ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతానికి దాదాపు 4వేల కిలోమీటర్లు రష్యన్ భూభాగంలోకి దూసుకెళ్లి మరీ వైమానిక స్థావరాలపై దాడి చేసింది.ఇంతకాలం ఉక్రెయిన్ పై బాంబుల వర్ష కురిపించిన విమానాలను ధ్వంసం చేసింది. వాటిలో Tu-95, Tu -22 వంటి వ్యూహాత్మక రష్యన్ బాంబర్లు, కమాండ్ విమానాలు ఉన్నాయి.
రష్యలోని ముర్మాన్స్క్, ఇర్కుట్క్స్, ఇవనోవో, రియాజాన్, అమూర్ ప్రాంతాలలో మొత్తం ఐదు వైమానిక స్థావరాలను కైవ్ ఫస్ట్ పర్సన్ వ్యూ(FPV) డ్రోన్లను ఉపయోగించి ఉక్రెయిన్ దాడులు చేసింది. అయితే ఇవనోవో, రియాజాన్ ,అముర్ ప్రాంతాలలోని సైనిక వైమానిక క్షేత్రాలపై జరిగిన అన్ని ఉగ్ర దాడులను తిప్పికొట్టాం.. సైనికులు లేదా పౌరులలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు..ఉగ్ర దాడుల్లో పాల్గొన్న కొంతమందిని అదుపులోకి తీసుకున్నామని అని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.
ఉక్రెయిన్ డ్రోన్లు దాడిలో తమ విమానాలు చాలా వరకు మంటల్లో కాలిపోయాయని మాస్కో అంగీకరించింది. "ముర్మాన్స్క్ ,ఇర్కుట్స్క్ ప్రాంతాలలోని సైనిక వైమానిక స్థావరాలకు దగ్గరగా ఉన్న ప్రాంతాల నుంచి FPV డ్రోన్లను ప్రయోగించడంలో అనేక విమానాలు ధ్వంసమయ్యాయని తెలిపింది.
ఆపరేషన్ స్పైడర్స్ వెబ్..
రష్యా వైమానికస్థావరాలపై జరిపిన దాడులకు ఆపరేషన్ స్పైడర్స్ వెబ్ అని పేరు పెట్టుకుంది ఉక్రెయిన్. ఈ ఆపరేషన్ లో భాగంగా 2022 నుంచి ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న దండయాత్రలో ఉపయోగించిన 41 విమానాలను ధ్వంసం చేసింది. వాటిలో Tu-95, Tu -22 వంటి వ్యూహాత్మక రష్యన్ బాంబర్లు, కమాండ్ విమానాలు ఉన్నాయి. ఇప్పటివరకు రష్యా దాడులకు ప్రతీకారంగా రష్యాలోని లక్ష్యాలను ధ్వంసం చేసేందుకు అనేకసార్లు ప్రయత్నించినా విఫలమైంది ఉక్రెయిన్. ఈ సారి గురి తప్పకూడదని .. ఏడాది కాలంగా పక్క ప్రణాళికలు రచించిన ఉక్రెయిన్.. ఆదివారం రష్యాలోని కీలక వైమానకి స్థావరాలపై దాడులు చేసి ఇంతకాలం ఉక్రెయిన్ పై బాంబుల వర్షం కురిపించిన యుద్ద విమానాలను ధ్వంసం చేసింది.
స్పైడర్స్ వెబ్ ఆపరేషన్ ను ఏడాదిన్నర కాలంపాటు ప్రణాళికలు చేసిన తర్వాత ప్రారంభించామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తెలిపారు. మూడేళ్లుగా కొనసాగుతున్న యుద్దంలో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న రష్యా సైనిక స్థావరాలపై జరిపిన ఆపరేషన్ లో అద్భుతమైన ఫలితం అన్ని జెలెన్ స్కీ అన్నారు. మొత్తం 117డ్రోన్లను ఈ దాడిలో ప్రయోగించాం.. రష్యా వైమానిక స్థావరాల్లో 34 శాతం వ్యూహాత్మక క్రూయిజ్ క్షిపణి యుద్ద విమానాలను ధ్వంసం చేశామని జెలెన్ స్కీ చెప్పారు.
ఉక్రెయిన్ SBU వర్గాల సమాచారం ప్రకారం.. ఆపరేషన్ లో భాగంగా డ్రోన్లను ముందుగానే రష్యాలోకి అక్రమంగా రవాణా చేశారు. ట్రక్కుల్లో చెక్క క్యాబిన్లలో డ్రోన్లను దాచి రవాణా చేశారు. దాడి సమయంలో డ్రోన్లను వాటి లక్ష్యాల వైపు ఎగిరేందుకు వీలుగా వాటి నిర్మాణాల పైకప్పులను రిమోట్ గా ఉపయోగించారు. SBU షేర్ చేసిన ఫోటోలు రవాణా కంటైనర్లలో అనేక చిన్న నల్ల డ్రోన్లు ఉన్నట్లు కనిపిస్తోంది.
ఉక్రెయిన్ సరిహద్దు నుంచి దాదాపు 4,300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇర్కుట్స్క్ ఒబ్లాస్ట్లోని బెలాయా ఎయిర్బేస్ ,ఉత్తరాన ఫ్రంట్లైన్ల నుంచి దాదాపు 2వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ముర్మాన్స్క్ ఒబ్లాస్ట్లోని ఒలెన్యా ఎయిర్బేస్ ఈ దాడిలో దెబ్బతిన్నాయి. వైరల్ అవుతున్న వీడియో ఈ రెండు ఎయిర్బేస్లలో రష్యన్ విమానాలు మంటల్లో ఉన్నట్లు, టార్మాక్ పైన దట్టమైన పొగ ఎగసిపడుతున్నట్లు కనిపిస్తోంది.
అయితే ఇవనోవో ,రియాజాన్ ప్రాంతాలలో అలాగే రష్యన్ ఫార్ ఈస్ట్లోని చైనా సరిహద్దుకు సమీపంలో ఉన్న అముర్లో జరిగిన దాడులను విజయవంతంగా తిప్పికొట్టినట్లు రష్యా మంత్రిత్వ శాఖ తెలిపింది.