తెలంగాణలో డ్రగ్స్‌‌ కేసులు రెండింతలైనయ్‌‌: లోక్‌‌సభలో కేంద్రం

తెలంగాణలో డ్రగ్స్‌‌ కేసులు రెండింతలైనయ్‌‌: లోక్‌‌సభలో కేంద్రం

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో 2020తో పోలిస్తే 2021లో డ్రగ్స్ కేసులు రెండింతలకు పైగా పెరిగినట్లు కేంద్రం వెల్లడించింది. అలాగే, ఏపీలోనూ భారీగా కేసులు పెరిగినట్లు శుక్రవారం లోక్‌‌సభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ రాతపూర్వక సమాధానం ఇచ్చింది. 2019–2021 మధ్య డ్రగ్ ట్రాఫికింగ్ పరిధిలోని నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రాఫిక్ సబ్‌‌స్టాన్స్(ఎన్డీపీఎస్) యాక్ట్–1985 కింద దేశంలో నమోదైన కేసుల సంఖ్యను వెల్లడించింది. ఇందులో తెలంగాణలో 2019లో 258 కేసులు నమోదు కాగా.. 2020లో 245 కేసులు, 2021లో 624 కేసుల నమోదైనట్లు తెలిపింది. అయితే, ఏపీలో 2019లో 431, 2020లో 602, 2021లో 1,085 కేసులు పెరిగాయని వెల్లడించింది..