ఫుల్లుగా పార్టీ చేసుకుని, పీకల దాకా తాగి కారులో వెళ్లేవాళ్లు డ్రంకెన్డ్రైవ్లో బుక్కయిపోతున్న సంగతి తెలిసిందే. దాని నుంచి తప్పించుకునేందుకు చాలా మంది క్యాబ్లు బుక్ చేసుకుని పోతుంటారు. అయితే, అదీ నేరమే!! అవును, అయితే ఇక్కడ కాదు లెండి. గుజరాత్లో. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జోర్దార్గా చేసుకునేందుకు జనం రెడీ అవుతున్నారు కదా. పార్టీ అంటే మందూ ఉంటది కదా. దానికి చెక్ చెప్పేందుకే గుజరాత్ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అన్ని క్యాబ్ సంస్థలతో మీటింగ్ కూడా పెట్టారు. ఎవరైనా ఫుల్లుగా తాగి క్యాబ్ బుక్ చేసినా, తమతో పాటు మందు తీసుకొచ్చుకున్నా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని వాళ్లకు సూచించారు.
గుజరాత్లో మందును నిషేధించి చాలా రోజులైందన్న సంగతి తెలిసిందే కదా. అంతేకాకుండా మందు వల్ల ఎన్నెన్ని అనర్థాలు జరుగుతున్నాయో కూడా చూస్తున్నాం కదా. అందుకే న్యూ ఇయర్ రోజు ఎవరైనా మందు తాగి క్యాబులెక్కినా, మందు తీసుకుపోయినా నేరమేనంటున్నారు. అంతేకాదు, ఎక్కినోళ్ల గురించి పోలీసులకు చెప్పకుండా రైడ్కు తీసుకెళితే క్యాబ్ డ్రైవర్లపైనా కేసులు పెడతామని హెచ్చరించారు. ‘‘మేం ఈ మధ్యే క్యాబ్ ఆపరేటర్లతో మీటింగ్ పెట్టాం. న్యూ ఇయర్ సందర్భంగా ట్రాఫిక్ కష్టాలు లేకుండా చూసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. దాంతో పాటే మందు తాగే వాళ్ల గురించీ చర్చించాం. ఎవరైనా తాగేసి క్యాబ్ ఎక్కితే పోలీసులకు పట్టివ్వాలని చెప్పాం. తాగినా, మందును తీసుకుపోతున్నా వెంటనే లొకేషన్ షేర్ చేయాలని చెప్పాం. మేం ట్రాక్ చేసి తాగినోళ్లను, మందును తీసుకెళ్లేటోళ్లను అరెస్ట్ చేస్తాం” అని ఓ సీనియర్ అధికారి చెప్పారు.
ఆరుగురు అరెస్ట్
ఇలాంటి కేసుల్లో ఇప్పటికే తాగి క్యాబ్లో వెళుతున్న ఆరుగురిని అరెస్ట్ చేశారు. అందులో బెంగళూరు, విజయవాడకు చెందిన వ్యక్తులున్నారు. మందు తీసుకెళుతున్న మరో ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు. అందులో ఒకరు విదేశీయుడు. తాగినోళ్లు ఎవరైనా క్యాబ్ ఎక్కితే వెంటనే సమాచారం ఇవ్వాల్సిందిగా పోలీసులు చెప్పినట్టు సబర్మతికి చెందిన ఓ క్యాబ్ డ్రైవర్ చెప్పాడు. ఇంతకుముందు తన క్యాబ్లో ఎవరైనా ఇల్లీగల్ యాక్టివిటీస్కు పాల్పడితే చెప్పాలన్న ఆదేశాలున్నాయన్నారు.