- దుబాయ్ నుంచి అమృత్సర్ వస్తున్న ఇండిగో ఫ్లైట్లో ఘటన
అమృత్సర్: ఎయిర్ హోస్టెస్పై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన దుబాయ్– అమృత్సర్ ఇండిగో విమానంలో శనివారం జరిగింది. పంజాబ్లోని జలంధర్ కోట్టి గ్రామానికి చెందిన రాజిందర్ సింగ్ అనే ప్యాసింజర్.. మద్యం మత్తులో తోటి ప్రయాణికులను ఇబ్బంది పెట్టాడు. దీంతో అతన్ని మందలించిన ఎయిర్ హోస్టెస్తో వాగ్వాదానికి దిగాడని పోలీసులు తెలిపారు. అసభ్యంగా ప్రవర్తిస్తూ, తిడుతూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని వెల్లడించారు. దీంతో వారు ఎయిర్ లైన్ అసిస్టెంట్ సెక్యూరిటీ మేనేజర్కు తెలియజేయగా.. ఆయన అమృత్సర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు శ్రీగురు రాందాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకొని, నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడు మద్యం మత్తులో వేధించినట్లు పోలీసుల విచారణలో తేలింది. అతడిపై సెక్షన్ 354, సెక్షన్ 509 కింద కేసు నమోదు చేశారు.