మద్యంమత్తులో ఫ్లైట్ అటెండెంట్ వేలు కొరికిన ప్రయాణికుడు

మద్యంమత్తులో ఫ్లైట్ అటెండెంట్ వేలు కొరికిన ప్రయాణికుడు

విమానంలో ఓ ప్రయాణికుడు వీరంగం సృష్టించాడు. మద్యంమత్తులో సిబ్బందితో దురుసుగా ప్రవర్తించగా.. అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఫ్లైట్ అటెండెంట్ వేలు కొరికేశాడు. ఇస్తాంబుల్ నుంచి ఇండోనేషియా రాజధాని జకర్తాకు వెళ్తున్న టర్కిష్ విమానంలో ఈ ఘటన జరిగింది. విమానంలో ప్రయాణికుల ముందే సిబ్బందిపై పంచులు విసురుతూ దురుసుగా ప్రవర్తించాడు. దీంతో విమాన సిబ్బంది అతడిని కట్టడి చేసేందుకు ప్రయత్నించారు. 

సిబ్బందిలో ఒకరు ప్రయాణికుడిని తన్నడంతో మరింత కోపోద్రిక్తుడై ఫ్లైట్ అటెండెంట్ వేలు కొరికాడు. దీంతో జకర్తాకు వెళ్లాల్సిన విమానాన్ని మెడాన్ లోని కౌలానాము ఎయిర్ పోర్టులో  ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. సదరు ప్రయాణికుడిని దించేసి.. గాయపడ్డ సిబ్బందికి చికిత్స అందించారు. ఘటనపై మెడాన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.