
జూబ్లీహిల్స్, వెలుగు: మద్యం మత్తులో ట్రాఫిక్పోలీస్పై దాడి చేసిన ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్చేశారు. విజయవాడకు చెందిన హరిహరణ్నగరంలోని ఓ హాస్టల్ లో ఉంటున్నాడు. ఈ నెల 26న రాత్రి ట్రాఫిక్ పోలీసులు మధురానగర్పోలీస్స్టేషన్పరిధిలో పిల్లర్నంబర్1022 వద్ద డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు.
ఆ సమయంలో మద్యం మత్తులో బైక్పై వచ్చిన హరిహరణ్ను ఆపారు. ఆల్కహాల్ టెస్ట్చేసేందుకు ప్రయత్నించగా అతను కోపోద్రిక్తుడై ఆర్ఎస్సై నాగరాజుపై దాడి చేశాడు. పోలీసులు హరిహరణ్ను అదుపులోకి తీసుకున్నారు. సోమవారం రిమాండ్ కు తరలించినట్లు పేర్కొన్నారు.