కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆగస్టు 27న తమిళనాడులోని ఊటీలో మహిళా చాక్లెట్ ఫ్యాక్టరీని సందర్శించారు. ఫ్యాక్టరీ ఉద్యోగులతో వారి అనుభవం, తయారుచేసే ఉత్పత్తుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో రాహుల్ దగ్గరకు వచ్చిన ఒక చిన్న అమ్మాయి.. ఆటోగ్రాఫ్ కోసం ఒక నోట్బుక్ని అందజేసింది. ఆ తర్వాత రాహుల్ ఆ చిన్నారికి ఆటోగ్రాఫ్ ఇచ్చి.. “మీరు నాకు ఓ సహాయం చేయగలరా?” అని రాహుల్ ఆ చిన్నారిని అడిగారు.
అప్పుడు ఆ అమ్మాయి నవ్వి చేస్తాను అని చెప్పింది. "మీ ఆటోగ్రాఫ్ నాకు ఇవ్వగలరా?" అని రాహుల్ గాంధీని అడిగి అదే నోట్ బుక్ ఆమెకు ఇచ్చారు. ఆ తర్వాత ఆమె నవ్వుతూ ఆ బుక్ లో సంతకం చేసి ఇచ్చింది. ఈ వీడియోను కాంగ్రెస్ అధికారిక ఖాతా తన అధికారిక X (గతంలో ట్విట్టర్ అని పిలుస్తారు)లో పోస్ట్ చేసింది.
రాహుల్ గాంధీ అధికారిక యూట్యూబ్ ఛానెల్లోనూ దీనికి సంబంధించిన పూర్తి వీడియోను అప్లోడ్ చేశారు. యూట్యూబ్లో అప్లోడ్ చేసిన ఈ వీడియోలో, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ.. తనకు "ఊటీలోని అత్యంత ప్రసిద్ధ బ్రాండ్లలో ఒకటైన మోడిస్ చాక్లెట్లను సందర్శించే అవకాశం వచ్చింది" అని అన్నారు.
A team of 70 incredible women drives one of Ooty’s famous chocolate factories!
— Rahul Gandhi (@RahulGandhi) August 27, 2023
The story of Moddys Chocolates is a remarkable testament to the great potential of India's MSMEs.
Here's what unfolded during my recent visit to the Nilgiris:https://t.co/yNdM37M01M pic.twitter.com/UfPvLryBuC