మద్యం మత్తులో స్టూడెంట్స్​ను చితకబాదిన టీచర్

మద్యం మత్తులో స్టూడెంట్స్​ను చితకబాదిన టీచర్
  • టీచర్​ను గదిలో బంధించిన విద్యార్థుల తల్లిదండ్రులు 
  • భద్రాద్రి కొత్తగూడెం జీపీపల్లిలో  ఘటన

చర్ల, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం జీపీపల్లిలో మద్యం మత్తులో ఓ టీచర్​స్టూడెంట్స్​ను చితకబాదాడు. దీంతో బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు టీచర్​ను గదిలో నిర్బంధించారు. స్థానికుల కథనం ప్రకారం..జీపీపల్లిలోని మండల పరిషత్​ ప్రాథమికొన్నత పాఠశాల ఇన్​చార్జి హెడ్​మాస్టర్​ భానోత్ ​కృష్ణ బుధవారం మద్యం తాగి స్కూల్​కు వచ్చాడు. కొందరు విద్యార్థులను అకారణంగా చితకబాదాడు.

విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్​కు వచ్చి టీచర్​ను గదిలో బంధించి ఎంఈవోకు సమాచారమిచ్చారు. ఆయన విచారణకు ఓ అధికారిని పంపించడంతో అతడికి  పొంతనలేని సమాధానాలిచ్చాడు. స్టూడెంట్స్ ​మాట్లాడుతూ ఇన్​చార్జి హెడ్​మాస్టర్ ​రోజూ తాగి వచ్చి కొడుతున్నాడని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు.