దుబ్బాక ఓటర్లు సరైన గుణపాఠం నేర్పుతారు

దుబ్బాక ఓటర్లు సరైన గుణపాఠం నేర్పుతారు

కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ విజయశాంతి

హైదరాబాద్: దుబ్బాక ఓటర్లు అధికార అండతో రెచ్చిపోతున్న టీఆర్ఎస్ పార్టీ నేతలకు సరైన గుణపాఠం నేర్పుతారని కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ విజయశాంతి పేర్కొన్నారు.  నిజాం నవాబులు తమ విధేయులైన దొరల దన్ను, ఆర్థిక, భూ బలాలు, కిరాయి బలగాలతో ఏ విధమైన అధికారం చెలాయించారో తరతరాల తెలంగాణ చరిత్ర చెబుతుందని ఆమె తెలిపారు.  అదే ధోరణిలో నేటి నయా టీఆరెస్ దొరలు ప్రజాస్వామ్యాన్ని తమ అహంకారపు అదుపాజ్ఞలలోని యంత్రాంగంగా వ్యవస్థీకృత చెల్లుబాటు చేసి… తెలంగాణ బిడ్డలపై నడిపించే ప్రక్రియ జరుగుతున్నదనేది వాస్తవం అన్నారు. విజ్ఞులైన మన తెలంగాణ ప్రజలు ఇది గమనించి దుబ్బాక ఎన్నికలలో టీఆరెస్‌కు సరైన బుద్ధి చెబుతారని విశ్వసిస్తున్నానని విజయశాంతి పేర్కొన్నారు.