- దుబ్బాకకు వచ్చి పోటీచేస్తావా? .
- హరీశ్రావుపై ఎమ్మెల్యే రఘునందన్రావు ఫైర్
దుబ్బాక, వెలుగు : ‘గుజరాత్లో మేం ఆరో సారి గెలుస్తున్నాం. తెలంగాణలో మూడో సారి గెలిచే సత్తా మీకుందా? హరీశ్.. ధైర్యముంటే రానున్న ఎన్నికల్లో సిద్దిపేటను కాపాడుకో.. నీకు చేతనైతే దుబ్బాకలో పోటీ చేయి.. లేకుంటే నేనే వచ్చి సిద్దిపేటలో పోటీ చేస్తా.. మంచిగా మాట్లాడడం నేర్చుకో.. జిల్లా మంత్రివని మర్యాద ఇస్తున్నా.. కాపాడుకో.. దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రజలు కర్రు కాల్చీ వాతలు పెట్టినా బుద్ధి రాలేదు’ అని మంత్రి హరీశ్రావుపై దుబ్బాక ఎమ్మెల్యే రఘనందన్రావు మండిపడ్డారు. మంగళవారం దుబ్బాకలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘దుబ్బాక ఎమ్మెల్యే రిబ్బన్ను కట్ చేయడానికి తిరుగుతుండని మాట్లాడుతావా? నీ పక్కన కూర్చుండే ఎంపీకి రాజకీయాలు తెలియవు. నియోజకవర్గంపై అవగాహన ఉండదు. అలాంటి వ్యక్తి మాటలు నమ్మి నన్ను విమర్శిస్తావా? మీకు ప్రోటోకాల్ తెలుసా?’ అని ప్రశ్నించారు. రామలింగారెడ్డి బతికున్నన్ని రోజులు దుబ్బాకలో అడుగు పెట్టని ఎంపీ ప్రభాకర్రెడ్డి.. తమకు రాజకీయ సుద్ధులు చెప్పడం సరికాదన్నారు. సొంత ఊరిలో పేదలకు డబుల్బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వలేనివాళ్లు తన గురించి మాట్లాడటమేంటని ప్రశ్నించారు. దుబ్బాకలో మీటింగ్పెట్టుకోవడానికి చేతగాని ఎంపీ.. సిద్దిపేటలో పెట్టుకుని దుబ్బాక ప్రజల అత్మాభిమానం దెబ్బతీశారని ఆరోపించారు.