సికింద్రాబాద్,వెలుగు: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి నెలన్నర ముందే జర్నీ కష్టాలు మొదలయ్యాయి. ఏ రైలులో చూసినా ఒక్క సీటు రిజర్వేషన్ ఖాళీగా లేదు. ఏపీ వైపు వెళ్లే రైళ్లల్లో సీట్లన్నీ ఫుల్గా నిండిపోయాయి. ఒక్కో రైలులో వందల్లో వెయిటింగ్ లిస్ట్ ఉంది. రైల్వే స్పెషల్ ట్రైన్స్ నడిపితే తప్ప సొంతూరిలో పండుగ చేసుకునే పరిస్థితి కనిపించడం లేదు. ప్యాసింజర్ల రద్దీని బట్టి స్పెషల్ ట్రైన్స్ రన్చేసేందుకు రైల్వే శాఖ తగు చర్యలు తీసుకోవాల్సి ఉంది.
ఏపీకి వెళ్లే రైళ్లన్నీ ఫుల్
సంక్రాంతి సెలవులు జనవరి 9 నుంచి మొదలవుతుండగా ఏపీకి వెళ్లేవారు ఇప్పటికే అడ్వాన్స్బుకింగ్ చేసుకోగా రైళ్లలో సీట్లన్నీ ఫుల్అయ్యాయి. వచ్చే నెల 13న కూడా టికెట్లు దొరికే పరిస్థితులు లేవు. ఏపీకి వెళ్లే గోదావరి, గౌతమి, గరీబ్ రథ్ వంటి రెగ్యులర్ రైళ్లు ఫుల్గా బుక్ అయ్యాయి. ఫలక్నుమా, ఎల్టీటీ ,కోణార్క్ వంటి రైళ్లలో కూడా అలాంటి పరిస్థితే ఉంది. సికింద్రాబాద్ నుంచి వైజాగ్, కాకినాడ, నర్సాపూర్, తెనాలి వైపు రిజర్వేషన్ పూర్తియింది. ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి ప్రాంతాలకైతే అసలు టికెట్లు దొరకడం లేదు. ఒడిశా, బెంగాల్ వైపు వెళ్లే రైళ్లలో కూడా బెర్త్లు ఖాళీగా లేవు.
స్పెషల్రైళ్ల కోసం వెయిటింగ్
సంక్రాంతికి రైళ్లన్నీ ఫుల్గా రిజర్వ్ కావడంతో ఇప్పుడు ప్యాసింజర్లు స్పెషల్ రైళ్ల కోసం వెయిట్ చేస్తున్నారు. స్పెషల్ రైళ్లు నడిపితే సీట్ రిజర్వేషన్ చేసుకునేందుకు చూస్తున్నామంటున్నారు. ప్రతిసారి సంక్రాంతికి రైల్వే శాఖ ఏపీకి స్పెషల్ రైళ్లను నడుపుతుంది. గతేడాది కరోనా కారణంగా సాధారణ రైళ్లు తప్పితే స్పెషల్ ట్రైన్స్నడపలేదు. ఈసారి నడుపుతుందా..? లేదా..? ఒకవేళ నడపకుంటే ఎలా వెళ్లాలనే కన్ ఫ్యూజన్లో ప్యాసింజర్లు పడిపోయారు. పండుగకు ప్యాసింజర్ల సౌకర్యార్థం స్పెషల్ రైళ్లు నడపాలని రైల్వే యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. రద్దీని పరిగణలోకి తీసుకుని స్పెషల్ రైళ్లను నడిపేందుకు రైల్వే అధికారులు ఆలోచిస్తున్నారు.