ఉధృతంగా పారుతున్న దుందుభి వాగు

ఉధృతంగా పారుతున్న దుందుభి వాగు

ఉప్పునుంతల/కల్వకుర్తి, వెలుగు : నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు దుందుభి వాగు ఉరకలేస్తోంది. శుక్రవారం వాగు ఉధృతి పెరగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కల్వకుర్తి మండలం రఘుపతిపేట, ఉప్పునుంతల మండలం మొలగర వద్ద ఉధృతి ఎక్కువైంది.

వంగూర్  మండలంలోని డిండి చింతపల్లి వద్ద ఇసుక కోసం వాగులోకి వెళ్లిన రెండు ట్రాక్టర్లు నీటిలో చిక్కుకున్నాయి.