గొప్ప సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది

గొప్ప సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది

దుల్కర్‌‌‌‌ సల్మాన్, ఐశ్వర్య లక్ష్మీ జంటగా అభిలాష్ జోషి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కింగ్ ఆఫ్ కోథా’. జీ స్టూడియోస్, వేఫేరర్ ఫిల్మ్స్ కలిసి నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ ఇలా ముచ్చటించింది. ‘మలయాళంలో చాలా సినిమాలు చేశాను. కానీ దుల్కర్‌‌‌‌‌‌‌‌తో కలిసి నటించడం ఇప్పటికి కుదిరింది. ఇంత పెద్ద మలయాళీ సినిమాలో భాగం కావడం కూడా ఇదే ఫస్ట్ టైమ్. చాలా మాసీవ్ సెట్స్ వేశారు. ప్రతి సీన్ నిండుగా ఉంటుంది. స్క్రీన్ టైమ్ తక్కువే అయినా..  కీలకమైన పాత్రలో కనిపిస్తాను. తార అనే పాత్ర పోషించా. దుల్కర్‌‌‌‌‌‌‌‌, నాకు మధ్య వచ్చే ప్రేమకథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎమోషనల్ సీన్స్ చేయడం చాలెంజింగ్‌‌‌‌గా అనిపించింది. 
ఇక దుల్కర్‌‌‌‌‌‌‌‌తో వర్క్ చేయడం ఎవరికైనా ఆనందంగా ఉంటుంది. తనొక ట్రూ జెంటిల్ మెన్. చాలా వినయంగా ఉంటారు. ప్రతి ఒక్కరిని సమానంగా గౌరవిస్తారు. అభిలాష్ జోషి కొత్త దర్శకుడైనప్పటికీ ఎంతో క్లారిటీగా, అనుభవమున్న  దర్శకుడిలా తీశారు. కోథా అనే టౌన్‌‌‌‌లో జరిగే ఫిక్షనల్ స్టోరీ ఇది. గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. ప్రస్తుతం తమిళంలో ఓ సినిమా చేస్తున్నా. త్వరలోనే అనౌన్స్ మెంట్ వస్తుంది. నిర్మాతగా తీసిన గార్గి, కుమారి చిత్రాలు సంతృప్తిని ఇచ్చాయి. 
అయితే మరో ఒకటిన్నర ఏడాది ఆవైపు ఆలోచనలు లేవు. గుర్తుండిపోయేలా ఉండే పాత్రలు చేయాలన్నదే నాకున్న పెద్ద డ్రీమ్. దానికోసం ఒక్కో అడుగు ముందుకేస్తున్నా’. తెలుగులో ‘దసరా’ చిత్రం నచ్చింది. అందులో కీర్తి సురేష్  చేసిన క్యారెక్టర్స్ లాంటివి చేయాలనుంది. అలాగే సమంత గారి ‘ఓ బేబి’ నా ఫేవరేట్.  ‘ఫిదా’లో సాయిపల్లవి నటన, డాన్స్ ఇష్టం.  శ్రీలీల డాన్స్‌‌‌‌ని కూడా ఎంజాయ్ చేస్తాను’.